విద్యతోనే ఉజ్వల భవిత | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే ఉజ్వల భవిత

Jun 3 2025 2:16 PM | Updated on Jun 3 2025 2:16 PM

విద్యతోనే ఉజ్వల భవిత

విద్యతోనే ఉజ్వల భవిత

కొరుక్కుపేట: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని శ్రీకనకదుర్గ తెలుగు పాఠశాలల(ఎస్‌కేడీటీ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ సీఎంకే రెడ్డి హితవు పలికారు. చైన్నె విల్లివాక్కంలోని ఎస్‌కేడీటీ ప్రైమరీ పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసి న ఏసీ తరగతి గదిని సోమవారం డాక్టర్‌ సీఎంకే రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అడ్మిషన్లు కూడా ప్రారంభించారు. అనంతరం కొత్తగా ఈ విద్యా సంవత్సరంలో చేరిన చిన్నారులకు పూలదండలు వేసి చాక్లె ట్లు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ప్రధానోపాధ్యాయురాలు ఎస్‌.రేణుక అతిథులకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఏసీ తరగ తి గది ఏర్పాటుకు కారకులైన బీజేపీ నాయకుడు, నమో గార్డ్‌ ట్రస్ట్‌ ట్రస్టీ ఎన్‌.నాగభూషణంను, డాక్టర్‌ సీఎంకేలను పాఠ శాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఎస్‌కేడీటీ మహోన్నత పాఠశాలలో కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, నోటు పుస్తకాలను ఉచితంగా అందజేశారు. పాఠశాల ఉపాధ్యక్షుడు జె.రాజశేఖర్‌ బాబు, టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement