
కుల మతాలకు
చెరుకు రైతు గుర్తు దక్కేనా?
ఎమ్మెల్యేలకు పళణి విందు
కుల మతాలకు అతీతంగా కశ్మీరి ప్రజలు తమను అక్కున చేర్చుకున్నారని, అత్యంత సురక్షితంగా చూసుకున్నారని, జాగ్రత్తగా స్వస్థలాలకు పంపించారని తమిళ పర్యాటకులు వ్యాఖ్యానించారు. కశ్మీర్ పర్యటనకు వెళ్లిన తమిళ పర్యాటకులు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు. గురువారం సుమారు వంద మంది సురక్షితంగా చైన్నెకు చేరుకున్నారు. వీరందరినీ ప్రత్యేక వాహనాలతో వారి వారి స్వస్థలాలకు పంపించారు. తుపాకీ తూటాలకు గాయపడ్డ డాక్టర్ పరమేశ్వరన్ను మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా సీఎం స్టాలిన్ పరామర్శించారు.
● కశ్మీరి ప్రజల సహకారంపై తమిళ పర్యటకులు
●సురక్షితంగా స్వస్థలాలకు..
●చైన్నె నుంచి వాహనాలలో తరలింపు
●నేడు మరో 22 మంది రాక
●ఢిల్లీ ఎయిమ్స్కు పరమేశ్వరన్ తరలింపు
మృతదేహాన్ని నెల్లూరుకు తరలిస్తూ..
విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న పర్యాటకులు
సాక్షి, చైన్నె: జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన పర్యాటకులపై మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో ఈనెల 22న ఉగ్రవాదులు పంజా విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తమిళులు సైతం చిక్కుకున్నట్టుగా వచ్చిన సమాచారంతో సీఎం స్టాలిన్ ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి విజయన్, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. పుదుకోట్టైకు చెందిన ఐఏఎస్ అధికారి అఫ్తాబ్ రసూల్ను హుటాహుటిన కశ్మీర్కు పంపించారు. అక్కడి అధికారులతో కలిసి తమిళుల వివరాలను సేకరించారు. వీరందర్నీ చైన్నెకు సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీకి చేరుకున్న పర్యాటకులను ప్రభుత్వ ప్రతినిధి విజయ్ ఆహ్వానించి, చైన్నెకు పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ నుంచి ఉదయాన్నే 22 మందితో తొలి బృందం చైన్నె విమానాశ్రయానికి చేరుకుంది. వీరందర్నీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆహ్వానించారు. ప్రత్యేక వాహనాలలో మదురై, కుంబకోణం, ఈరోడ్, తిరుచంగోడు తదితర ప్రాంతాలలోని స్వస్థలాలకు పంపించారు. ఆతర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా చైన్నెకు మరో 50 మందితో బృందం వచ్చారు. మొత్తంగా సుమారు వంద మంది చైన్నెకు వచ్చారు. వీరందరినీ స్వస్థలాలకు ప్రభుత్వ ప్రత్యేక వాహనాలలో పంపించింది. తమ వారిని ఆప్తులు ఆలింగనం చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక ఈ దాడిలో మరణించిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదనరావు భౌతిక కాయానికి అధికారులు నివాళులర్పించారు. అనంతరం రోడ్డు మార్గంలో కావలికి తరలించారు.
న్యూస్రీల్
పాకిస్తానీయుల వివరాల సేకరణ
చైన్నె, కోయంబత్తూరు వంటి నగరాలలో వివిధ సంస్థలు, ఆస్పత్రులలో ఉన్న పాకిస్తానీయుల వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమైనట్టు సమాచారాలు వెలువడ్డాయి. వైద్యం కోసం వచ్చిన వారు, వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని పాకిస్తాన్కు వెనక్కు పంపించే దిశగా కసరత్తులు మొదలయ్యాయి. వారంలోపు అందరూ భారత్ను వీడాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక చైన్నెతో పాటూ అన్ని నగరాలలోని విమానాశ్రయాలలో భద్రత, తనిఖీలు కొనసాగుతున్నాయి. బస్టాండ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన మార్గాలలో వాహన తనిఖీలు విస్తృతం అయ్యాయి. ఈ తనిఖీల్లో కోయంబత్తూరులో రూ. 35 లక్షలు నగదును కేరళకు తరలిస్తున్న సత్యవన్ అనే వ్యక్తి పట్టుబట్టాడు. అలాగే కడలూరులో అన్వర్ అనే యువకుడి నుంచి రూ. 40 లక్షలు సీజ్ చేశారు. ఈ నగదు తరలింపునకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేని దృష్ట్యా, హవాల నగదుగా పోలీసులు భావించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఆందోళనగా..
చైన్నెకు చేరుకున్న మహిళలు స్పందిస్తూ, తొలుత తమకు ఏం జరిగిందో అన్న విషయం తెలియలేదని, బైసారన్కు సమీపంలోని తాము ఉండి పోయామన్నారు. ఆ తర్వాత దాడి సమాచారం తెలుసుకుని తీవ్ర ఆందోళనకు లోనయ్యామని పేర్కొన్నారు. ఈ సమయంలో తమను కశ్మీరి ప్రజలు అక్కున చేర్చుకున్నారని, కుల మతాలకు అతీతంగా తమను రక్షించారని ఆనందం వ్యక్తం చేశారు. అక్కడి డ్రైవర్లు అయితే, అత్యంత సురక్షితంగా తమను వాహనాలలో కిందికి తీసుకొచ్చారన్నారు. ఓ యువకుడు స్పందిస్తూ, తనతో పాటుగా వచ్చినవారితో తాను రోడ్డు మీద ఉండగా ఎ మర్జన్సీ ఎమర్జన్సీ అన్న హెచ్చరికలు వినిపించడంతో ఆందోళనకు గురి అయ్యానని, ఈ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఇక్కడి నుంచి వాహనాలలో వెళ్లి పోవాలని సూచించారని, కాసేపు టెన్షన్లో పడ్డామన్నారు. అక్కడి స్థానికులు తమకు ఆశ్రయం కల్పించారని, అధికారులు రాక ముందే తమను వాహన డ్రైవర్లు సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారని వివరించారు. ఓ బాలుడు పేర్కొంటూ, బైసారన్కు వెళ్లాల్సిందేనని తాను పట్టుబట్టానని, మార్గం మధ్యలో హోటల్లో తమ కుటుంబ సభ్యులతో టిఫిన్ చేస్తుండగా వాతవరణం అనుకూలించడం లేదని అటు వైపుగా వెళ్ల వద్దు అన్న హెచ్చరికలు రావడంతో తీవ్ర మనో వేదనకు గురి అయ్యానని పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత ఉగ్ర దాడి సమాచారం తెలుసుకుని షాక్కు గురైనట్టు వివరించారు. కొందరు తమిళ పర్యాటకులు పేర్కొంటూ, కశ్మీరీ ప్రజలు తమను రక్షించారని, వారికి రుణ పడి ఉన్నామన్నారు. అస్సలు వారే ఎంతో ఆందోళనతో ఉన్నా, తమకు ఆందోళన అన్నది కలుగకుండా జాగ్రత్తగా వాహనాలను డ్రైవర్లు నడి సురక్షితంగా ఎల్తైన ప్రదేశం నుంచి కిందకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కాగా, ఈ దాడిలో గాయపడ్డ చైన్నెకు చెందిన డాక్టర్ పరమేశ్వరన్ను మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు విజయన్ తెలిపారు. కశ్మీర్లో 122 మంది తమిళులు పర్యటనలో ఉన్నట్టు గుర్తించామని, వీరిలో 22 మందిని శుక్రవారం చైన్నెకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గాయపడ్డ వారిలో చంద్రు అక్కడి ఆస్పత్రిలోనే చికిత్సలో ఉన్నట్టు పేర్కొన్నారు.

కుల మతాలకు