వడివడిగా విలీనం.. | - | Sakshi
Sakshi News home page

వడివడిగా విలీనం..

Nov 28 2025 11:39 AM | Updated on Nov 28 2025 11:49 AM

వడివడ

వడివడిగా విలీనం..

ఆమనగల్లు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. మార్కెట్‌యార్డు ఆవరణలో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందని చెప్పడంతో పదిరోజుల పాటు మార్కెట్‌ యార్డులో ధాన్యం ఆరబెట్టాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన తరువాత మిల్లర్లు బస్తాకు కిలో నుంచి రెండు కిలోలు తరుగు తీసివేస్తున్నారని చెప్పారు. దీంతో మిల్లర్లు తరుగు ఎందుకు తీస్తున్నారని అదనపు కలెక్టర్‌ కొనుగోలు నిర్వాహకులు, పీఏసీఎస్‌ సీఈఓ దేవేందర్‌ను ప్రశ్నించారు. ధాన్యంలో తాలు ఉన్నప్పుడు తరుగు తీయొచ్చని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వనజాత చెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. మిల్లర్లు తరుగు ఎలా తీస్తున్నారో పరిశీలించాలని ఆమనగల్లు ఎమ్మార్వో ఫయీం ఖాద్రికి సూచించారు. తూకంవేసిన ధాన్యాన్ని వెంటవెంటనే కేటాయించిన మిల్లుకు పంపించాలని, సత్వరమే బిల్లులు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఆమనగల్లు మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్‌, మార్కెట్‌కమిటీ డైరెక్టర్‌ వస్పుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో శివార్లలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మున్సిపాలిటీల విలీనంతో ఆయా స్థానిక సంస్థల్లో రికార్డులు, ఆస్తుల స్వాధీనంపై పురపాలకశాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఉద్యోగుల సంఖ్య లెక్క తేల్చే పనిలో నిమగ్నమైంది. రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల నగర/పురపాలక సంఘాలను జీహెచ్‌ఎంసీలో కలుపుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ఆ లోపే ఆయా మున్సిపాలిటీ వివరాల సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుత బల్దియా పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత విలీన ప్రాంతాలపై పురపాలక శాఖ మరింత పట్టు బిగించనుంది. అప్పటిలోపు రికార్డులు, ఆస్తులు, ఆదాయ వనరులు, పద్దుల వివరాల లెక్క తీయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

తీన్‌మార్‌!

ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్‌ఎంసీ మెగా కార్పొరేషన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ను రెండు లేదా మూడుగా విభజించాలనే ప్రతతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ను ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. అయితే, కార్పొరేషన్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని వార్డుల పునర్విభజన, సర్కిళ్ల ఏర్పాటుపై ముందడుగు వేయాలని పురపాలక శాఖ యోచిస్తోంది. సంస్థాగత పునర్విభజన కార్పొరేషన్ల సంఖ్యను బట్టి ఉన్నందున.. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. రెండు లేదా మూడు కార్పొరేషన్ల సరిహద్దులను బట్టి ఏ కార్పొరేషన్‌లో ఏ మున్సిపాలిటీలు చేరతాయానేది స్పష్టం కానుంది. విలీనమైన యూఎల్‌బీలు ప్రస్తుతం స్పెషలాఫీసర్ల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఇవి జీహెచ్‌ఎంసీలో కలవడంతో వీరి సేవల నుంచి ఉపసంహరించుకోనున్నారు.

ప్రజాభిప్రాయం అవసరమా ?

గతంలో గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన వెంటనే వాటిని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో విలీనం చేయడం తెలిసిందే. ఇప్పుడు వాటిని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయనున్నారు. వీటికి ప్రజాభిప్రాయ సేకరణ అవసరమని కొన్ని వర్గాలు చెబుతుండగా, గ్రామపంచాయతీలను యూఎల్‌బీల్లో విలీనం చేసినప్పుడే ఆ ప్రక్రియ కూడా మమ అనిపించారని కొందరు చెబుతున్నారు.

రైతులకు ఇబ్బంది కలిగించొద్దు

ఆదాయ వనరులు, రికార్డుల సేకరణపై కసరత్తు

ఉద్యోగులు, సిబ్బంది లెక్కలు తేల్చే పనిలో పురపాలకశాఖ

కార్పొరేషన్ల సంఖ్యను బట్టి వార్డులు, సర్కిళ్ల పునర్విభజన

విలీన మున్సిపాలిటీల్లో స్పెషల్‌ ఆఫీసర్ల పాలనకు తెర

అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి

వడివడిగా విలీనం.. 1
1/1

వడివడిగా విలీనం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement