భూములు లాక్కోవద్దు | - | Sakshi
Sakshi News home page

భూములు లాక్కోవద్దు

Nov 28 2025 11:39 AM | Updated on Nov 28 2025 11:49 AM

భూముల

భూములు లాక్కోవద్దు

భూములు లాక్కోవద్దు కడ్తాల్‌: దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు ఏర్పాటు పేరుతో లాక్కోవాలని చూడడం తగదని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ఎక్వాయిపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ జయశ్రీ అధ్యక్షతన గురువారం గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, భూ సేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజు, కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఎకరాకు రూ.30 లక్షల పరిహారం లేదా రూ.25 లక్షలతో పాటు ప్లాట్‌ ఇచ్చేందుకు సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలు, విధి విధానాలు, న్యాయపరమైన నష్ట పరిహారం ప్రకటించడకుండా సేకరణ ఎలా చేపడతారని భూ నిర్వాసితులు ప్రశ్నించారు. ఇక్కడి భూముల మార్కెట్‌ ధరకు అనుగుణంగా ఎకరాకు రూ.కోటి పరిహారం అందించాలని, లేకపోతే భూమికి భూమి అందించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామసభను బహిష్కరించారు. రైతుల డిమాండ్లు, విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో భూ నిర్వాసితులు రవికాంత్‌గౌడ్‌, జోగు వీరయ్య, కరుణాకర్‌, జంగయ్య, శ్రీను, హరీశ్‌, వెంకటేశ్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. ముమ్మరంగా వాహనాల తనిఖీ అక్రమ నిర్మాణం అడ్డుకున్న అధికారులు

కడ్తాల్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడ్తాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముచ్చర్ల కూడలి వద్ద గురువారం ప్రత్యేకంగా చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఐ గంగా ధర్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రజలు శాంతి, క్రమశిక్షణ పాటించాలని అన్నారు. ఎవరైనా గందరగోళ పరిస్థితులు సృష్టించాలని ప్రయత్నిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో మద్యం అనధికారికంగా విక్రయించినా, అధిక ధరలకు అమ్మినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, అనుమానాస్పదంగా సంచరించినా పోలీసులకు తెలపాలన్నారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్తే సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ వరప్రసాద్‌, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడిన కబ్జాదారులు

తుర్కయంజాల్‌: ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టడమే కాకుండా, అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెంట్‌ మండల పరిధి ఇంజాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, గ్రామ పాలన అధికారి సుప్రియ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ సర్వే నంబర్‌ 126లో స్వామి, విజయ్‌ కుమార్‌ అనే వ్యక్తులు సుమారు 300 గజాల స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణ పనులను కొన్ని రోజులుగా చేపడుతున్నారు. మొదటి నుంచి ఇది ప్రభుత్వ భూమి అని ఇందులో నిర్మాణం చేపట్ట వద్దని చెప్పినా వినడం లేదన్నారు. తహసీల్దార్‌ సుదర్శన్‌ రెడ్డి ఆదేశాల మేరకు నిర్మాణం వద్దకు వెళ్లగా అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ మేరకు కబ్జాదారులపై ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. అక్రమ నిర్మాణం చుట్టూ తహసీల్దార్‌ ఆదేశాల మేరకు జేసీబీ సహాయంతో కందకం తవ్వించినట్లు చెప్పారు.

భూములు లాక్కోవద్దు 
1
1/2

భూములు లాక్కోవద్దు

భూములు లాక్కోవద్దు 
2
2/2

భూములు లాక్కోవద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement