Manipur Election 2022: PM Modi Greets Grand Welcome at Imphal Rally - Sakshi
Sakshi News home page

ప్రచారానికి వెళ్తున్న ప్రధాని మోదీ.. ఒక్కసారిగా కాన్వాయ్‌ ఆపి.. 

Feb 22 2022 4:08 PM | Updated on Feb 22 2022 7:24 PM

PM Modi Greets Party Workers In Manipur - Sakshi

ఇంపాల్‌: మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మరో ఆరు రోజుల్లో మొదటి దశలో ఎన్నికలకు పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో బీజేపీ ప‍్రచారంలో జోరు పెంచింది. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇంపాల్‌లోని లువాంగ్‌సంగ్‌బామ్‌ క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని వస్తున్న మార్గంలో బీజేపీ మహిళా కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.

భారత్‌ మాతా కీ జై, మోదీ జీకి జై అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రధాని మోదీ ​కాన్వాయ్‌లో నుంచి అక్కడున్న మహిళలకు కరచాలనం అందించారు. వారితో ముచ్చటించారు. ఈ వీడియోను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మణిపూర్‌లో విలువైన క్షణాలు.. మీ అభిమానానికి కృతజ్ఞతలు అంటూ ప్రధాని ట్యాగ్‌ లైన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాల వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో ఫిబ‍్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement