
సాగు ప్రణాళిక ఖరారు
జిల్లా సమాచారం
మండలాలు 14 రైతుల సంఖ్య 1,61,032 భూవిస్తీర్ణం(ఎకరాల్లో) 2,95,194 సాగుకు యోగ్యమైనది (ఎకరాల్లో) 2,76,076
పెద్దపల్లిరూరల్: జిల్లాలో వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయాధికారులు ఖరారు చేశారు. జి ల్లాలో మొత్తం 2,95,194 ఎకరాల భూమి ఉండగా.. అందులో 2,76,076 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇందులో అధికంగా వరి 2,12,500 ఎకరాల్లో సాగయ్యే అవకాశముందని, ఆ తర్వాత పత్తి 52,500 ఎకరా ల్లో సాగు కావొచ్చని, మరో 10,086 ఎకరాల్లో ఉద్యానవన పంటలు, 705 ఎకరాల్లో మొక్కజొన్న పండించే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారు. ఇందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
పెరగనున్న వరి సాగు విస్తీర్ణం
ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. దీంతో రైతులు సన్నాల సాగువైపే మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో గత వానాకాలంలో 2,10,027 ఎకరాల్లో వరి పండించగా, ఈసారి 2,12,500 ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పత్తి గత వానాకాలంలో 52,669 ఎకరాల్లో సాగు కాగా, ఈసారి 52,500 ఎకరాల్లో సాగవుతుందని వారు భావిస్తున్నారు.
విత్తన కొరత రాకుండా..
రైతులకు అవసరమైన విత్తనాల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరి సాగుకు 53,125 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. పత్తి విత్తన ప్యాకెట్లు 1,31,250, మొక్కజొన్న విత్తనాలు 70.5 క్వింటాళ్ల వరకు అవసరమని అధికారులు పేర్కొన్నారు.
ఎరువుల అవసరం ఇలా..
జిల్లాలో సాగయ్యే పంటలకు ఏ మేరకు రసాయన ఎరువులు అవసరవుతాయో అంచనాకు వచ్చిన అ ధికారులు.. అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. యూరియా 32,447 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. డీఏసీ 7,900 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 6,331 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 600 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 23,453 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా నిల్వలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
అందుబాటులో నాణ్యమైన విత్తనాలు
జిల్లాలో పెసర సాగుచేసే రైతుల కోసం నాణ్యమైన ఐపీఎం–410–3(శిఖా) రకం విత్తనం సిద్ధంగా ఉంచారు. భారత పప్పుదినుసుల పరిశోధనా సంస్థ, కాన్పూర్ నుంచి ఈ రకం విత్తనం విడుదలైందని అధికారులు తెలిపారు. 65 నుంచి 70రోజుల్లో దిగుబడి వచ్చే ఈరకం ఎకరాకి 10క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుందని వారు అంటున్నారు. జిల్లాలో 30 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచారు. నాలుగు కిలోల ప్యాకెట్ ధర రూ.592గా ఉందని, ఎకరాకి 8కిలోల విత్తనం అవసరమవుతుందని పేర్కొన్నారు. ఈ విత్తనాలు పెద్దపలి డీసీఎంఎస్ గోదాం, సుల్తానాబాద్ సహకార సంఘం, బేగంపేట, మంఽథఽని (సోమన్పల్లి), కాల్వశ్రీరాంపూర్ సహకార సంఘం, నందిమేడారం సహకార సంఘంలో అందుబాటులో ఉన్నాయి.
వానాకాలంలో వరి, పత్తి వైపే మొగ్గు
10వేల ఎకరాల్లోనే ఉద్యాన పంటలు
ప్రణాళి ప్రకారం ముందుకు ..
వానాకాలం పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులకు కొరత రాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. మంచి దిగుబడులు సాధించే నాణ్యమైన విత్తనాలనే రైతులకు అందేలా చూస్తాం. ఇప్పటికే పెసర విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉంచాం. ఈసారి వరి సాగు విస్తీర్ణం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
– ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

సాగు ప్రణాళిక ఖరారు