
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
సారంగాపూర్: బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన ఆకుల చిన్న గంగన్న (55) బుధవారం పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం.. గంగన్న ఏడాది క్రితం చెట్టుపై నుండి కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయినా శరీరంలో విపరీతమైన నొప్పులు ఉండడంతో అసౌకర్యానికి గురవుతున్నాడు. మందులు వాడినా నొప్పులు తగ్గడంలేదు. జీవితంపై విరక్తి చెంది ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. గంగన్న భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్ట్
కథలాపూర్: మండలకేంద్రానికి చెందిన కల్లెడ జైపాల్ అక్రమంగా గంజాయి తరలిస్తూ విక్రయిస్తున్న క్రమంలో పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. జైపాల్ గంజాయిని కోరుట్ల, కథలాపూర్ ఏరియాలో విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు మెట్పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేశ్బాబు పర్యవేక్షణలో మంగళవారం రాత్రి తనిఖీ చేపట్టగా సిరికొండ శివారులో పట్టుబడ్డాడు. అతడి నుంచి 96 గ్రాముల గంజాయి, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
స్వగ్రామానికి చేరిన గల్ఫ్ మృతదేహం
కథలాపూర్(వేములవాడ): మండలంలోని పోసానిపేటకు చెందిన గుంట హన్మంతు(42) సౌదీ అరేబియాలో రెండు నెలల క్రితం హత్యకు గురికాగా.. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. హన్మంతు కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్తున్నాడు. తాను ఉంటున్న గదిలో నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన వ్యక్తితో ఫిబ్రవరి 28న గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హన్మంతు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మల్యాల: మండలంలోని జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన వేల్పుల మార్క్ (21) దుర్మరణం పాలయ్యాడు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. మార్క్ జగిత్యాల నుంచి వేములవాడ వైపు బైక్పై వెళ్తున్నాడు. మల్యాల క్రాస్రోడ్ వద్దకు రాగానే కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో మార్క్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 లో జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మార్క్ తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ కోన శ్రీనివాస్పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
జగిత్యాలటౌన్: జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బ్యాగ్ను తిరిగి ఆమెకు అప్పగించారు సిబ్బంది. జగిత్యా ల డిపోకు చెందిన బస్సులో వరంగల్కు చెందిన సులోచన కరీంనగర్లో ఎక్కింది. తులం బంగారం, సెల్ఫోన్, డబ్బులు ఉన్న బ్యాగ్ ను బస్సులో మరిచిపోయి దిగిపోయింది. బస్ కండక్టర్ గంగప్రసాద్ ఆ బ్యాగ్ను గుర్తించి జగిత్యాల డిపోలో అప్పగించారు. ఇంటికెళ్లిన ప్రయాణికురాలు బ్యా గ్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించి టికెట్ ఆధారంగా జగి త్యాల డిపోకు చేరుకుంది. అన్ని ఆధారాలను పరిశీలించిన ఆర్టీసీ సిబ్బంది ఆ బ్యాగును ఆమెకు అందించారు. బ్యాగును అందించిన కండక్టర్ గంగప్రసాద్, సిబ్బ ందికి సులోచన ధన్యవాదాలు తెలిపారు. డిపో క్లర్క్ మొండయ్య తదితరులు ఉన్నారు.

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య