
భూభారతి చట్టంతో రైతులకు మేలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
మంథని: భూ భారతి చట్టం–2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరి ష్కారం లభిస్తుందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. నాగారం రైతువేదికలో భూభారతి చట్టంపై బుధవారం అవగాహ న కల్పించారు. తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ స్థాయి వరకు సమస్యలను పరిష్కారించే వెసులుబాటు ఈ చట్టంలో ఉందన్నారు. రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించారని, భూ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు ముందు తప్పనిసరి భూమి సర్వే చేయించి మ్యాప్ తయారుచేయాల్సి ఉంటుందన్నారు. ఏమైనా సందేహలు ఉంటే తీర్చడానికి అధికారులు సిద్ధంగా ఉంటారని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, మంథని ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ కుమార్స్వామి తదితరులు పాల్గొన్నారు.