ఫలితాల్లో ‘స్ఫూర్తి’ | - | Sakshi
Sakshi News home page

ఫలితాల్లో ‘స్ఫూర్తి’

Apr 23 2025 8:15 AM | Updated on Apr 23 2025 8:51 AM

ఫలితాల్లో ‘స్ఫూర్తి’

ఫలితాల్లో ‘స్ఫూర్తి’

గోదావరిఖనిటౌన్‌: స్థానిక విఠల్‌నగర్‌కు చెందిన కన్నాపురం స్ఫూర్తి ఇంటర్‌ హెచ్‌ఈసీలో 978 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో స్ఫూర్తి ఇంటర్మీడియెట్‌ చదివింది. ఆమె తండ్రి నాగేందర్‌.. స్థానిక గౌతమినగర్‌లోని ఓ రైస్‌ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నారు. తల్లి లావణ్య గృహిణి. వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా చిన్నకూతురు స్ఫూర్తి చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తోంది. ఐదు నుంచి పదో తరగతి వరకు స్థానిక సప్తగిరికాలనీ మహాత్మాజ్యోతిబా పూలే గురుకులంలో చదివింది. పదో తరగతిలో 9.2 జీపీఏ సాధించింది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 493 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఇప్పుడు సెకండియర్‌లలో ప్రతిభ చాటింది. ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని స్ఫూర్తి తెలిపింది. తనది పేద కుటుంబమని, తన పైచదువులకు ప్రభత్వం ప్రోత్సాహం అందించాలని విద్యార్థిని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement