పిడుగు పాటుకు నలుగురికి గాయాలు

చికిత్స పొందుతున్న పిడుగుపాటుకు గురైన మహిళ - Sakshi

గుర్ల: మండలంలోని కొండగండ్రేడులో శనివారం పడిన పిడుగు పాటుకు నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన మంత్రి అప్పలరాములు, మంత్రి సింహచలం, పరాల జయ, పొట్నూరు లక్ష్మి శనివారం సాయంత్రం పొలాల్లో మొక్కజొన్న పంట పనిలో ఉన్నారు. ఒక్కసారిగా వాతావారణం మారడంతో ఉరుములతో కూడిన వర్షం పడింది. మహిళలు పనిచేస్తున్న కొద్ది దూరంలో పిడుగు పడడంతో నలుగురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు 108 సహయంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారులు చికిత్స అందిస్తున్నారు. నలుగురు మహిళలకు చికిత్స అందిస్తున్నా.. సృహలోకి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.




 

Read also in:
Back to Top