చీమలమందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

చీమలమందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

Mar 24 2023 5:58 AM | Updated on Mar 24 2023 5:58 AM

పార్వతీపురం: గరుగుబిల్లి మండల కేంద్రానికి చెందిన ఎం.నాగమణి మనస్తాపానికి గురై చీమలమందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ సంఘటనపై పార్వతీపురం ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తన భర్త రాంబాబుతో మనస్పర్థల కారణంగా నాగమణి కొన్నేళ్లుగా అమ్మగారి ఇంటివద్ద ఉంటోంది. ఇటీవల వారి కుమార్తె పుష్పవతి అయ్యింది. ఈ విషయాన్ని భర్తకు ఫోన్‌లో చెప్పగా ఫంక్షన్‌ చేయకు, నేను రానుంటూ కసురుకున్నాడు. ఈ విషయమై మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఉన్న చీమలమందు తాగేసింది.గమనించిన స్థానికులు ఇంటిలో ప్రాథమిక చికిత్స అందించి 108 వాహనంద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement