
అభినందనలు
ఒడిశా నూతన డిప్యూటీ సీఎంలు కనకవర్దన్ సింగ్దేవ్, ప్రభాతి పరిడాలను నబరంగ్పూర్ బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
బుధవారం భువనేశ్వర్లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. – కొరాపుట్
మాజీ సీఎం నవీన్తో
సీనియర్ నాయకుల భేటీ
రాయగడ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ ఘోర పరాజయం పొందింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాజధాని భువనేశ్వర్కు ఆ పార్టీ సీనియర్ నాయకులు బుధవారం వెళ్లారు. నవీన్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్తో భేటీ అయ్యారు. రాయగడ జిల్లా బీజేడీ అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు, మాజీ మంత్రి దేవిప్రసాద్ మిశ్రో, అరుణ్ సాహు తదితర సీనియర్ నాయకుల ఉన్నారు.
మిల్లెట్ మిషన్ కేంద్రం పరిశీలన
కొరాపుట్: జిల్లాలో సమిలిగుడ సమితి రాజ్పుట్ గ్రామంలోని మిల్లెట్ మిషన్ కేంద్రాన్ని కలెక్టర్ వి.కీర్తివాసన్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. ఈ గ్రామంలో మహిళలు మిలెట్లు ద్వారా అనేక ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయంతో పాటు, ఉత్పత్తిలో సహకారం అందిస్తున్నాయి. వీరి ఉత్పత్తులకు అవసరమైన మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే వీరి ఉత్పత్తుల ప్రదర్శన కోసం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను ఆహ్వానించారు. మిషన్ పనితీరుని కలెక్టర్తో వెళ్లి అధికారులు పరిశీలించారు.
మల్లిఖార్జున ఖర్గేతో ఎమ్మెల్యే బాహిణీపతి భేటీ
కొరాపుట్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో కొరాపుట్ జిల్లా జయపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి న్యూఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. బాహిణీపతి 2000, 2004 ఎన్నికల్లో కొరాపుట్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన చట్టంతో కొరాపుట్ ఎస్సీ కేటగిరిగా మారింది. దీంతో తన రాజకీయ జీవితం జయపూర్కి మార్చారు. అక్కడ 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున మరలా గెలిచి సత్తాచాటారు. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ పక్షనేత పదవి కోసం అతని తరుపున సీనియర్ నేతలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడితో బాహిణీపతి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
ఆమదాలవలస : ప్రకృతి వ్యవసాయంతో అధిక పంట దిగుబడులు సాధించవచ్చునని రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ విభాగం ఎన్ఎఫ్ఏ రాజా అన్నారు. బుధవారం నిమ్మతొర్లాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై సిబ్బంది సమీక్ష నిర్వహించారు. ముందుగా రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న క్షేత్రాలను, ఏ–గ్రేడ్ మోడల్స్ను సందర్శించారు. రైతుల వివరాలను ఐసీఆర్పీ రికార్డ్స్లో కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. నవధాన్యాలు వేసిన రైతుల వివరాలను, సాగులో ఆచరించిన పద్ధతులను విధిగా రికార్డు చేయాలన్నారు.

అభినందనలు

అభినందనలు

అభినందనలు