ఇసుక దందా | - | Sakshi
Sakshi News home page

ఇసుక దందా

Jun 28 2025 8:57 AM | Updated on Jun 28 2025 8:57 AM

ఇసుక

ఇసుక దందా

పచ్చనేతల

కూటమి ప్రభుత్వం కొన్ని నెలల తర్వాత ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టింది. దీంతో అధికార పార్టీ చోటా మోటా నాయకులకు ఇది వరంగా మారింది. ఉచిత ఇసుకను కృష్ణానది, మున్నేరు, కట్టలేరు ఉపనదుల్లో ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు చేర్చి రాత్రి సమయంలో పెద్ద లారీలకు లోడింగ్‌ చేసి తెలంగాణలోని మధిర, ఖమ్మం, వైరా తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసరలో ఓ చోటా నాయకుడు మాత్రం ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నాడని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇసుకకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది.

కంచికచర్ల మండలం వేములపల్లిలో లారీల్లో తరలివెళ్తున్న ఇసుక

సాక్షి ప్రతినిధి, విజయవాడ: పచ్చనేతలు జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు నదుల్లో ఇసుత తవ్వకాలపై నిషేధం ఉంది. వాటిని తుంగలో తొక్కి నదుల నుంచి యథేచ్ఛగా తెలంగాణకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దందా అంతా పార్లమెంటు ప్రజాప్రతినిధి, నియోజక వర్గ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది. చెక్‌ పోస్టులు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పడం తప్ప, ఆచరణలో అమలు కావడం లేదు. పర్యవేక్షించాల్సిన మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు మామూళ్లు తీసుకొంటూ పచ్చ జెండా ఊపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.

తోడేస్తున్నారు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఇసుక లబ్ధిదారులకు అందుబాటులో ఉండేది. దీంతో ప్రతిఒక్కరూ సకాలంలో ఇళ్లు నిర్మించుకునేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి కానరావడం లేదు. రీచ్‌ల్లో కాంట్రాక్టర్‌కు నగదు చెల్లిస్తే చాలు ఎంత కావాలంటే అంత ఇసుకను లోడ్‌ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. నో చలానా... ఓన్లీ క్యాష్‌ అంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా లేకుండా విజయవాడ పార్లమెంట్‌ ప్రజాప్రతినిధి అనుచరులు, ఒక్కో లారీకి రూ.10వేలు ఇస్తే చాలు ఎన్ని టన్నులైనా లారీలకు నింపుతామని బహిరంగంగానే అంటున్నారు. కూటమి నేతలకు ఎవరికీ సంబంధం లేకుండా ఏకపక్షంగా పార్లమెంటు ప్రజాప్రతినిధి అనుచరులు మూడు రీచ్‌ల నుంచి ఇసుకను తోడేస్తున్నారు.

అధికారుల వత్తాసు

జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో ఇసుక రీచ్‌ నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు. వాటిలో కొన్ని లారీల ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ లారీ ఇసుక ధర లక్ష రూపాయలు పలుకుతోంది. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే సమయంలో పోలీసులు, మైనింగ్‌, రెవెన్యూ అధికారులు సైతం ఈ దందాకు వత్తాసు పలుకుతున్నారు. పార్లమెంటు ప్రజా ప్రతినిధి కార్యాలయంలో ఉండే అవినీతి‘ కిశోరం’ ఈ దందాకు రింగ్‌ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

‘జగ్గయ్యపేట’లో

వత్సవాయి మండలంలో ఇందుగు పల్లి, ఆళ్లూరుపాడు, పోలంపల్లి వద్ద మునేరు నుంచి ఇసుక అక్రమంగా టిప్పర్లో తెలంగాణకు తరలి పోతోంది. టిప్పర్లకు జేసీబీ ద్వారా ఇసుక లోడింగ్‌ చేస్తున్నారు. పెనుగంచిప్రోలు శివారులో వెంచర్‌లో ట్రాక్టర్లతో మునేరు నుంచి ఇసుక డంప్‌చేసి అర్ధరాత్రి తర్వాత లారీల్లో లోడ్‌ చేసి తెలంగాణకు తరలిస్తున్నారు. అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు మునేరు ఇసుక రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో శివాపురం, జొన్నలగడ్డ మీదుగా తెలంగాణకు తరలిపోతోంది. ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లో సాగుతోంది.

చెక్‌పోస్టులున్నా దాటిపోతోంది

జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి, రావిరాల, మల్కాపురం, అన్నవరం, గ్రామాల్లోని కృష్ణానది, మునేరు, పాలేరు నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా పక్క రాష్ట్రానికి వెళ్లిపోతోంది. చందర్లపాడు మండలం కాసరబాద నుంచి కృష్ణానది నుంచి ఇసుక లారీల్లో అక్రమంగా సరిహద్దులోని చెక్‌పోస్టులు సూర్యాపేట మీదుగా తెలంగాణాకు వెళ్తోంది. చెక్‌పోస్టులు ఉన్నా అధికారుల అండదండలతో సరిహద్దు దాటుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాలేరు, మునేరులలో నీరు ఉండటంతో ఇసుకను ఖాళీ ప్రదేశాలతో డంపింగ్‌ చేస్తున్నారు.

తెలంగాణకు అక్రమ రవాణా గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు బుట్ట దాఖలు నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు తెలంగాణలో లక్ష రూపాయలు పలుకుతున్న లారీ ఇసుక ధర కోట్లలో దోచుకుంటున్న ఇసుక, మట్టి మాఫియా రింగ్‌ మాస్టర్‌గా అవినీతి ‘కిశోరం’

తిరువూరు టు తెలంగాణ

తిరువూరు నియోజకవర్గ పరిసరాల్లోని తెలంగాణ సరిహద్దు గ్రామాలకు కృష్ణా నది ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీ నుంచి ఇసుకను టిప్పర్లలో తిరువూరు శివారులోని మర్లకుంట–తోకపల్లి, అక్కపాలెం, గంపలగూడెం మండలంలోని ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాల్లో దళారులు డంప్‌ చేస్తున్నారు. అక్కడ నుంచి ట్రాక్టర్లలో ఇసుకను కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాలకు తరలిస్తున్నారు. ట్రాక్టరు ఇసుక రూ.6వేల చొప్పున విక్రయిస్తున్నారు. మూడు రోజుల క్రితం తిరువూరు మీదుగా తరలుతున్న రెండు ఇసుక టిప్పర్లను తెలంగాణ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పెనుబల్లి మండలంలో స్వాధీనం చేసుకున్నారు.

ఇసుక దందా 1
1/2

ఇసుక దందా

ఇసుక దందా 2
2/2

ఇసుక దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement