
బాధ్యతగా మొక్కలు నాటుదాం
చల్లపల్లి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకువచ్చి పర్యావరణాన్ని కాపాడటంలో బాధ్యతగా వ్యవహరించాలని విజయవాడకు చెందిన వైద్యుల బృందం పేర్కొంది. 30 మందితో కూడిన ఎన్విరాన్మెంటల్ హెల్త్ కమిటీ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(ఫాగ్సి) బృందం స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాల్లో ఆదివారం పాల్గొంది. 216 జాతీయ రహదారికి ఇరువైపుల, జంక్షన్ పాయింట్లో మొక్కలు నాటారు. వైద్యులు మాట్లాడుతూ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పర్యటన చేపట్టినట్లు వివరించారు. అనంతరం పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలను స్వచ్ఛ రథసారఽథి డాక్టర్ డీఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులు వివరించారు.