
ఉగ్రవాదుల దాడి కిరాతకం
నిజామాబాద్నాగారం: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దాడులు అత్యంత కిరాతకమైనదని పలు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పలు చోట్ల మంగళవారం నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో నిజామాబాద్ పేపర్ బాయ్స్– ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో అమరులకు శాంతి కలగాలంటు కొవ్వొత్తులతో నివాళి అర్పించి మౌనం పాటించారు. కార్యక్రమంలో వనమాల సత్యం, రణం రవీందర్ గౌడ్, ఏజెంట్లు, సభ్యులు పాల్గొన్నారు.
గాజుల్పేట్లో రామరక్ష స్తోత్ర పారాయణం
నిజామాబాద్ రూరల్: నగరంలోని గాజుల్పేట్లో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులు సామూహిక పంచ సూక్త రామరక్ష స్తోత్ర పారాయణాన్ని మంగళవారం పఠించారు. కార్యక్రమంలో ప్రమోద్ వట్టల్ వార్, దత్తు శాస్త్రి, మనోహర శాస్త్రి, న్యాలం శ్రీనివాస్, ప్రమోద్ హర్గే గంగాధర్, చంద్ర శేఖర్ శర్మ, శ్రీధర్, వైర్కగర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.