
ఉద్యోగ భద్రత కల్పించాలి
సుభాష్నగర్: రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో పని చేస్తున్న పార్ట్ టైం లె క్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సంఘం అధ్యక్షురాలు ప్రసన్న కోరా రు. ఈ మేరకు మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రసన్న మాట్లాడుతూ.. పార్ట్ టైం లెక్చరర్ల డిమాండ్ల సాధనకు ఎనిమిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవ ల జారీ చేసిన జీవో నంబర్ 21లో సైతం తమకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధకరమన్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వా రికి హామీ ఇచ్చారు. సంఘం ప్రతినిధులు రఘువీర్, గంగాధర్ పాల్గొన్నారు.
జగన్మోహన్రెడ్డికి ఘన నివాళి
నిజామాబాద్అర్బన్: భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడంలో ఏబీవీపీ నాయకుడు జగన్మోహన్రెడ్డి చేసిన కృషి మరువలేనిదని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కై రి శశిధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్లో జగన్మోహన్రెడ్డి వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటకృష్ణ, దుర్గా దాస్, ప్రేమ్ వాసు, విష్ణు, సాత్విక్, ఈశ్వర్, సన్నీ, అభినవ్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి