ఏం కొనేటట్టు లేదు.. | - | Sakshi
Sakshi News home page

ఏం కొనేటట్టు లేదు..

Dec 1 2025 9:50 AM | Updated on Dec 1 2025 9:50 AM

ఏం కొనేటట్టు లేదు..

ఏం కొనేటట్టు లేదు..

● మోంథా తుపాను ప్రభావం: రాష్ట్రంలోని పంటలు భారీగా నష్టపోవటంతో దిగుబడులు సగానికి తగ్గాయి. ● వాతావరణ మార్పులు: అకాల వర్షాలు, ఎండలు,తెగుళ్లు, కీటకాలు పంటలపై తీవ్ర దెబ్బతీశాయి. ● దూర భారం : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదలతోపాటు, దూర ప్రాంతాల నుంచి తెప్పించుకోవడంతో రవాణా భారంగా మారి ధరలు పెరుగుతున్నాయి.

ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలు తగ్గిన దిగుబడి.. పెరిగిన రేట్లు

లక్ష్మణచాంద:ప్రస్తుతం కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులను కష్టాల్లోకి తోసేస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారానికి కూరగాయలు తప్పనిసరి. ఇప్పుడు రెండు కిలోల కూరగాయలు కొనాలన్నా రూ.200 దాటిపోతున్నాయి. మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై ఇది గట్టి దెబ్బ. ఇప్పటికే జిల్లాలో కూరగాయల సాగు అంతంత మాత్రంగా ఉంది. అక్టోబర్‌ చివరి వారంలో మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆ పంటలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో వ్యాపారులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు.

కార్తిక మాసం, అయ్యప్ప దీక్షలు..

మరోవైపు కార్తిక మాసంలో మాంసాహారం తినేవారు తక్కువ. కూరగాయలే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇక ఇదే మాసంలో అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యాయి. మండల దీక్షలతో దీక్షస్వాములు, వారి కుటుంబ సభ్యులు కూడా కూరగాయల భోజనం చేస్తారు. దీంతో కూరగాయలకు డిమాండ్‌ పెరిగింది. ధరలు పెరిగాయి. ఇక షష్టి వారాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం కూడా కూరగాయల ధరలపై పడింది.

ధరల పెరుగుదలకు కారణాలు..

మార్కెట్లో కూరగాయల ధరలు ఇలా...

కూరగాయలు ధర కిలోకు..

టమాటా రూ.50– 60

వంకాయలు రూ.80–100

చిక్కుడు రూ.100

బెండ రూ.100

బీర రూ.100

పచ్చిమిర్చి రూ.80

క్యాబేజీ రూ.80

కాలీఫ్లవర్‌ రూ.80

ఆలుగడ్డలు రూ. 40

తోటకూర రూ.50

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement