
అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్
● ఫేస్ రికగ్నేషన్ ఆధారంగా పౌష్టికాహారం ● ప్రస్తుతం 3 ఏళ్లలోపు చిన్నారులకు.. ● జూలై నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా.. ● పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు
లక్ష్మణచాంద: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అ య్యే గుడ్లు, బాలామృతం ప్యాకెట్లు, ఇతర పోషకా హార పదార్థాలు పక్కదారి పడుతున్నాయనే అపవా దు ప్రజల్లో ఉంది. ఈ సమస్యను అధిగమించి, చి న్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన స రుకులు పారదర్శకంగా, సక్రమంగా చేరేలా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భా గంగా, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార పంపిణీ సమయంలో ఫేస్ రికగ్నేషన్ విధానం తప్పనిసరి చేసింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు, జిల్లా ఐసీడీఎస్ అధికారులు ఈ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జూలై 1 నుంచి అందరికీ..
అంగన్వాడీ కేంద్రాల్లో జూలై 3 నుంచి అందరికీ ఫేస్ రికగ్నేషన్ ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం ఇదివరకు అంగన్వాడీ టీచర్ల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఉన్న పోషణ్ ట్రాకర్ యాప్ను అప్డేట్ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి అమలులోకి రానుంది. నూతన విధానంతో ఫేస్ రికగ్నేషన్ ద్వారా యాప్లో ఫొటోతోసహ నమోదు కానుండటంతో క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఉండదని అధికారులు అంటున్నారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పోషకాహారం ఎలా అందుతుందో అనే వాటిపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా సులువు కానుంది.
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు...
అంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారులకు అందించే అన్ని రకాల సరుకులు, పోషకాహారం పంపిణీ చేసే సమయంలో ఫేస్ రికగ్నేషన్ తప్పనిసరి చేయడంతో చిన్నారుల తల్లులు, ఇటు బాలింతలు, గర్భిణులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు అందాల్సిన అన్ని సరుకులు పక్కదారి పట్టకుండా పారదర్శకంగా చేరుతాయని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం చిన్నారులకు..
ప్రస్తుతం ఈ ఫేస్ రికగ్నేషన్ విధానం 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు అందించే బాలామృతం, గుడ్లు వంటి అదనపు పోషకాహార పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో, చిన్నారి తల్లి ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఫొటో తీసుకుని, పోషణ్ ట్రాకర్ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాతే సరుకులు అందిస్తున్నారు. ఈ విధానం ద్వారా పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడం సాధ్యమవుతోందని అంగన్వాడీ టీచర్లు తెలిపారు.
జిల్లా సమాచారం....
జిల్లాలో మొత్తం
అంగన్వాడీ కేంద్రాలు 926
నిర్మల్ డివిజన్లో 299
ఖానాపూర్ డివిజన్లో 246
భైంసా డివిజన్లో 201
ముధోల్ డివిజన్లో 180
మూడేళ్లలోపు చిన్నారులు 61,061
గర్భిణులు 5,916
బాలింతలు 6,012
ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు
ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులకు గుడ్లు, బాలామృతం ప్యాకెట్లు అందించే సమయంలో ఫేస్ రికగ్నేషన్ ద్వారా నమోదు చేస్తున్నాం. జూలై 1 నుంచి బాలింతలు, గర్భిణులకు కూడా ఫేస్ రికగ్నేషన్ తర్వాతనే పోషకాహారం అందిస్తాం. ప్రభుత్వం సూచనల మేరకు అమలు చేస్తాం.
– నాగమణి, సీడీపీవో నిర్మల్

అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్