Sakshi News home page

Karnataka Exit Polls: ఎగ్జిట్‌పోల్స్‌పై సీఎం బొమ్మై రియాక్షన్‌ ఇదే..

Published Wed, May 10 2023 8:10 PM

CM Basavaraj Bommai Comments On Karnataka Election Exit Polls - Sakshi

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడ్డాయి. కాగా, ఎగ్జిట్‌పోల్స్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏపార్టీకి ‍స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు. హాంగ్‌ దిశగా అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి ఈ నేపథ్యంలో కుమారస్వామి జేడీఎస్‌ మరోసారి కీలక కానుంది. ఎగ్జిట్‌పోల్స్‌ జేడీఎస్‌కు దాదాపు 20 స్థానాలకు పైగానే గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలిపాయి. 

ఈ క్రమంలో ఎగ్జిట్‌పోల్స్‌పై కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై స్పందించారు. తాజాగా బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్‌పోల్స్‌ వాస్తవ ఫలితాలు కాదు. కర్ణాటకలో మేమే గెలుస్తాం. రిసార్ట్‌ పాలిటిక్స్‌ అవసరం ఉండదు అని స్పష్టం చేశారు. 

మరోవైపు.. సీఎం భార్య చెన్నమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. 150కిపైగా స్థానాల్లో విజయం మాదే. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మ 50వేలకు పైగా మెజార్టీ విజయం సాధిస్తారు అని అన్నారు. 

ఇది కూడా చదవండి: కర్ణాటక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. 
 

Advertisement

What’s your opinion

Advertisement