
సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటింగ్
కృష్ణానదిలో విహారం కోసం ఇప్పటికే పర్యాటకశాఖ లాంచీ ప్రయాణాన్ని కల్పిస్తోంది. వీటితో పాటు జాలరులు ప్రైవేటుగా బోటు విహారాన్ని కల్పిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. వచ్చే నెలలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ క్రూయిజ్ ప్రయాణాన్ని పర్యాటకశాఖ అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం ఇప్పటికే లాంచీ క్రూయిజ్ను సిద్ధం చేశారు. ప్రస్తుతం కృష్ణానదిలో నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి లాంచీ క్రూయిజ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లాంచీ అందుబాటులోకి వస్తే కృష్ణానదిలో ప్రకృతి రమణీయ దృశ్యాలను తిలకిస్తూ ఆరుగంటల పాటు నదిలో ప్రయాణించేందుకు వీలు కలుగనుంది.
కృష్ణానదిలో బోటులో విహారం చేస్తున్న పర్యాటకులు