కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు

May 3 2025 8:23 AM | Updated on May 3 2025 8:23 AM

కాలం

కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు

మద్దూరు: బేకరీలు, స్వీట్‌ షాపులు, హోటళ్లలో కాలం చెల్లిన, కలుషిత ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ అన్నారు. శుక్రవారం మద్దూరులోరి బేకరీలు, స్వీట్‌ షాపులలో తనిఖీలు నిర్వహించారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. షాప్‌ యజమానులు ట్రేడ్‌ లైసెన్సులు తప్పని సరిగా తీసుకోవాలని, అలాగే ప్లాస్టిక్‌ కవర్లు వాడరాదని ఆదేశించారు.

ఆలయ భూముల వేలం మరోసారి వాయిదా

అలంపూర్‌: అలంపూర్‌ క్షేత్ర ఆలయాల భూముల కౌలు వేలం పాట మరోసారి వాయిదా పడినట్లు ఆలయ ఈఓ పురేందర్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఆలయ భూముల కౌలు వేలం నిర్వహించారు. గత నెల 21వ తేదీన ఆలయాలకు సంబందించిన అన్ని భూములకు బహిరంగ కౌలు వేలం నిర్వహించారు. వాటిలో 6 సర్వే నెంబర్లకు చెందిన భూముల కౌలు వేలం ధర రాకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. రెండో సారి మిగిలిన భూముల బహిరంగ కౌలు వేలం నిర్వహించారు. కర్నూల్‌ జిల్లా కల్లూరు శివారులోని 346/1, 346/3 సర్వే నెంబర్లలలోని 15.18 ఎకరాల భూమికి ఇద్దరు వ్యక్తులు డిపాజిట్‌ చెల్లించినట్లు ఈఓ పేర్కొన్నారు. కానీ వేలం షరతుల ప్రకారం కనీసం ముగ్గురు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉండటంతో వేలం వాయిదా వేసినట్లు తెలిపారు. అదేవిధంగా మిగిలిన 5 సర్వే నెంబర్ల భూముల కౌలు వేలానికి రైతులు రాకపోవడంతో వాటిని వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ నెల 16న మరోసారి వేలం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.

సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: త్వరలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు, సీఏ చార్టెడ్‌ అకౌంట్‌కు సంబంధించి ప్రవేశపరీక్షలు ఒకేసారి ఉన్న నేపథ్యంలో వెంటనే డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు పీయూ రిజిస్ట్రార్‌ రమేష్‌బాబుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మే 6 నుంచి 17వ తేదీ వరకు డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ఉన్నాయని, అదే సమయంలో సీఏ పరీక్ష ఉంటే విద్యార్థులు ఇబ్బంది అవుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వెంటనే వాయిదా వేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్‌, రవితేజ, శశికుమార్‌, విజయ్‌, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

బాదేపల్లి యార్డుకు

పోటెత్తిన దిగుబడులు

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయమార్కెట్‌కు శుక్రవారం వ్యవసాయ పంట దిగుబడులు పోటెత్తాయి. దాదాపు 20 వేల బస్తాలకు పైగా పంట ఉత్పత్తులు విక్రయానికి వచ్చాయి. ఇందులో అత్యధికంగా 7 వేల క్వింటాళ్ల ధాన్యంతో పాటు 3,913 క్వింటాళ్ల మొక్కజొన్న యార్డుకు వచ్చింది. దీంతో యార్డు షెడ్లు, ఆవరణ రైతులతో కిటకిటలాడింది. మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,337, కనిష్టంగా రూ.1,439 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు గరిష్టంగా రూ.6,075, కనిష్టంగా రూ.5,757, జొన్నలు గరిష్టంగా రూ.3,887, కనిష్టంగా రూ.3,027, హంస రకం ధాన్యం గరిష్టంగా రూ.2,006, కనిష్టంగా రూ.1,997, ఆన్‌ఎన్‌ఆర్‌ రకం గరిష్టంగా రూ.2,249, కనిష్టంగా రూ.1,800, వేరుశనగ గరిష్టంగా రూ.5,471, కనిష్టంగా రూ.4,747, కందులు రూ.6,449, పెబ్బర్లు రూ.4,827 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,143, కనిష్టంగా రూ.1,763గా ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,829 ధరలు నమోదయ్యాయి. మార్కెట్‌కు 1,500 బస్తాల ధాన్యం వచ్చింది.

కాలం చెల్లిన ఆహార  పదార్థాలు విక్రయిస్తే చర్యలు 
1
1/2

కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు

కాలం చెల్లిన ఆహార  పదార్థాలు విక్రయిస్తే చర్యలు 
2
2/2

కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement