ములుగు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పక్కాగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు శిక్షణ, అవగాహన నిర్వహించారు. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 92,113 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యంగా 145 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొన్న కేంద్రంలోనే రైతులకు ట్రక్ షీట్ అందించాలన్నారు. ప్యాడీ క్లీనర్తో పట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తేమను 17 శాతం కంటే తక్కువ ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి చేయాలి
సమాజానికి సవాలుగా మారిన మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధకానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నిరోధక జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంగా పని చేయాలన్నారు. మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తెలిస్తే 1908 టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్కుమార్, నార్కోటిక్ అసిస్టెంట్ కమిషనర్ సైదులు, జిల్లా ఎకై ్సజ్, ప్రొబేషన్ అధికారి శ్రీనివాస్, డీఏఓ సురేశ్కుమార్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, వాణిజ్య పన్నుల అధికారి దుగ్నేశ్వర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారి చంద్రకళ, విద్యాశాఖ కో–ఆర్డినేటర్ సాంబయ్య, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పోచం పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు
శిక్షణ