Sushant Singh Rajput Fans Trends Boycott Pavitra Rishta 2 In Twitter - Sakshi
Sakshi News home page

Boycott Pavitra Rishta 2: సుశాంత్‌ లేని సీరియల్‌ వద్దే వద్దు

Jul 13 2021 1:30 PM | Updated on Jul 13 2021 2:58 PM

Sushant Singh Rajput Fans Trends Boycott Pavitra Rishta 2 In Twitter - Sakshi

'పవిత్ర రిష్తా' సీరియల్‌ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చే వ్యక్తి సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌. 2009లో ఏక్తాకపూర్‌ తెరకెక్కించిన ఈ సీరియల్‌ బుల్లితెర మీద ప్రభంజనం సృష్టించింది. మానవ్‌గా సుశాంత్‌ సింగ్‌, అర్చనగా అంకిత లోఖండేల నటనకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. సుమారు ఐదేళ్లపాటు ప్రసారమైన ఈ సీరియల్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు సుశాంత్‌. తాజాగా ఈ సీరియల్‌ రెండో సీజన్‌ త్వరలో సందడి చేయబోతుందంటూ ఆల్ట్‌ బాలాజీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.

'ఆర్డినరీ జీవితాల్లో కొన్నిసార్లు ఎక్స్‌ట్రార్డినరీ లవ్‌స్టోరీలు కూడా కనిపిస్తాయి. పవిత్ర రిష్తా షూటింగ్‌ జరుపుకుంటోంది. త్వరలో ఆల్ట్‌ బాలాజీలో స్ట్రీమింగ్‌ కానుంది' అని ప్రకటన రిలీజ్‌ చేసింది. ఈ సీజన్‌లో అర్చన పాత్రను మరోసారి అంకిత చేస్తుండగా మానవ్‌ పాత్రలో నటించేందుకు షాహీర్‌ను ఎంపిక చేసుకున్నట్లు ఫొటోతో సహా వెల్లడించారు.

అయితే సుశాంత్‌ సింగ్‌ అభిమానులు మానవ్‌ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. సుశాంత్‌ వల్లే పవిత్ర రిష్తా సీరియల్‌ హిట్టయిందని, అలాంటిది అతడు లేకుండా రెండో సీజన్‌ ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. 'మానవ్‌ అంటే ఒక పేరు కాదు, అది ఒక ఎమోషన్‌.. మానవ్‌ 2గా సుశాంత్‌ను కాకుండా మరొకరిని ఊహించుకోలేం' అంటూ #BoycottPavitraRishta2 అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. సుశాంత్‌ అంటే నిజమైన ప్రేమే ఉంటే అంకిత ఈ సీరియల్‌లో నటించేందుకు ఒప్పుకునేదే కాదని సదరు నటిని కూడా విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement