
‘అన్నాత్తే’ కోసం హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు నయనతార. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అన్నాత్తే’. ఈ చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో ఆరంభమైన ఈ సినిమా షూటింగ్లో రజనీ పాల్గొంటున్నారు.
మంగళవారం నయనతార కూడా హైదరాబాద్ వచ్చారు. ఓ చార్టెర్డ్ ఫ్లయిట్లో ఆమె షూటింగ్ స్పాట్కు చేరుకున్నట్లు తెలుస్తోంది మొన్నటివరకు రజనీ, జగపతిబాబు పాల్గొనగా సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు రజనీ–నయన కాంబినేషన్ సీన్స్ తెరకెక్కిస్తారని ఊహించవచ్చు. ఈ ఏడాది నవంబరు 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.