భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

Jun 14 2025 10:00 AM | Updated on Jun 14 2025 10:00 AM

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

కొల్చారం(నర్సాపూర్‌): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని అదనపు కలెక్టర్‌ నగేష్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎనగండ్లలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. ఈసందర్భంగా గ్రామంలో చాలా ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న సాదా బైనామాలను వెంటనే పరిష్కరించాలని రైతులు అదనపు కలెక్టర్‌ను కోరారు. ఆయన వెంట తహసీల్దార్‌ శ్రీనివాసచారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అవసరమైన మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యా ప్రమాణాలు పెంపొందించే విధంగా బోధనను అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement