
ఐఈఈఈ లోగో ఆవిష్కరణ
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఐఈఈఈ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్) స్టూడెంట్ బ్రాంచ్ అధికారిక లోగోను మంగళవారం వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఐఈఈఈ అనేది ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక ప్రొఫెషనల్ సంస్థ అని, ఇది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మమేకమయ్యే అవకాశాన్ని, వృత్తిపరమైన నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్లు డాక్టర్ విఠల్, డాక్టర్ మహేష్, డాక్టర్ చంద్రశేఖర్ విభాగాధిపతి డాక్టర్ భావ్ సింగ్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.