సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారం

Jun 24 2025 3:47 AM | Updated on Jun 24 2025 3:47 AM

సత్వర

సత్వర పరిష్కారం

ప్రజావాణి

దరఖాస్తులకు

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వర పరిష్కారం చూపుతామని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాలుగేళ్లుగా తనకు పింఛన్‌ రావడం లేదని వెంటనే పునరుద్ధరించాలని కాగజ్‌నగర్‌కు చెందిన అభింబి కోరారు. నెల క్రితం భూమిని కుమారుడు, మనుమడికి పట్టా చేసి ఇవ్వగా.. తన పోషణ గురించి పట్టించుకోవడం లేదని పెంచికల్‌పేట్‌ మండలం చేడ్వాయి గ్రామానికి చెందిన బావాజీ ఆవేదన వ్యక్తం చేశాడు. వారి నుంచి తిరిగి భూమిని ఇప్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నాడు. తన రెండెకరాల వ్యవసాయ భూమికి రైతుభరోసా ఇప్పించాలని ఆసిఫాబాద్‌ పట్టణంలోని శివకేశవ మందిరం ప్రాంతానికి చెందిన వైరాగడే లక్ష్మి అర్జీ సమర్పించింది. మీసేవ కేంద్రం ఏర్పాటుకు అనుమతిచ్చి ఉపాధి చూపాలని పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూర్‌ గ్రామానికి చెందిన కొప్పుల రోహిత్‌ వేడుకున్నాడు. పులికుంట గ్రామ శివారులోని పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన అంగాల సాంబయ్య దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్‌ మండలం గోవిందపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను దేవాదాయశాఖ అడ్డుకుంటుందని, తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గ్రామస్తులు విన్నవించారు. తన భర్త పేరిట గల భూమిని కుమారుడు పట్టా చేసుకున్నాడని, ఇప్పుడు పోషణను పట్టించుకోవడం లేదని రెబ్బెన మండలం గంగాపూర్‌ గ్రామానికి చెందిన దుర్గం రుకుంబాయి తెలిపింది. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలు వందశాతం పూర్తిచేయాలన్నారు. మొత్తం 51లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనువైన స్థలాలు గుర్తించాలని ఆదేశించారు.

భూమి కబ్జాకు యత్నం

కాగజ్‌నగర్‌ మండలం గన్నారం శివారులో 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమిని పాలివాళ్లు కబ్జాకు యత్నిస్తున్నారు. భూమి కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం తనకు 80 ఏళ్లు ఉన్నాయి. ఎవరూ లేని తనకు న్యాయం చేయాలి.

– బడికెల దుర్గయ్య, గన్నారం, మం.కాగజ్‌నగర్‌

కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

సత్వర పరిష్కారం1
1/1

సత్వర పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement