
‘పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు’
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలో పోడు వ్యవసాయం చేసుకునే రైతులను అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ సువర్ణను సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. ప్లాంటేషన్ డ్రైవ్ పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పీసీసీఎఫ్(హెచ్ఎఫ్ఎఫ్) సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలి పారు. కార్యక్రమంలో నాయకులు ఎల్మూలే మల్లయ్య, డేగ అంకులు ఉన్నారు.