రాయచూరు రూరల్: గత ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆనకట్టలు ఎండుముఖం కనిపిస్తున్నాయి. నదిలో జల ప్రవాహం తగ్గిపోవడంతో రజోలిబండ డైవర్షన్ ఆనకట్ట నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1966లో తుంగభద్ర నదికి అడ్డంగా 31 అడుగుల ఎత్తు, 2690 మీటర్ల పొడవుతో ఆనకట్ట (గోడ)ను నిర్మించారు. నదికి లక్ష క్యూసెక్కుల నీరు వదిలినప్పుడు 17 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుంటారు. రాష్ట్రంలోని మాన్వి, రాయచూరు తాలూకాలలో ఈ నీటితో పది వేల ఎకరాలు సాగు అవుతుంది. ఇప్పుడు పూర్తిగా ఆనకట్ట ఎండిపోవడంతో మంత్రాలయం, మాధవరం, తుంగభద్ర, తెలంగాణాలోని శాంతి నగర, ఐజ ప్రజలకు తాగునీటి ఎద్దడి నెలకొంది. ఒకవైపు పంటలు పండక తాగునీరు లభించక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నేడు ఆనకట్ట పరిధిలో పూడిక పేరుకుపోవడంతో పాటు అక్రమంగా ఇసుక రవాణా కావడంతో నీటి సామర్థ్యం తగ్గినా అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండటంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు.
ఎండిపోయిన ఆర్డీఎస్ ఆనకట్ట
Published Mon, Apr 8 2024 12:45 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేయూ వైస్ చాన్స్లర్ రమేశ్పై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
చెట్టు మీదపడి కూలీ మృతి
నిజ బృందావన దర్శనం
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
‘బలగం’తో మంచి గుర్తింపు
గిరిజన గురుకులాల దరఖాస్తుకు నేడు ఆఖరు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి
ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రారంభం
తప్పక చదవండి
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- బాలాజీ నాయుడు టార్గెట్ రాజకీయ ప్రముఖులే...
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- కొండెక్కిన చికెన్ ధర
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అండమాన్కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే
Advertisement