
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
● టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఎస్ఈ రమేశ్ బాబు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ప్రమాదాల నివారణకు పెద్దపీట వేస్తున్నామని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు అన్నారు. కరీంనగర్ విద్యుత్ భవన్లో విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంచుతూ చైతన్య పరుస్తున్నామని చెప్పారు. జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా కరీంనగర్ సర్కిల్లోని డీఈ టెక్నికల్ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించామన్నారు. రైతులు, వినియోగదారులు ఎట్టి పరిస్థితిల్లో విద్యుత్ సంస్థ చేయాల్సిన పనులకు సొంతంగా చేయకూదడని సూచించారు. విద్యుత్ సమస్య తలెత్తితే 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని కోరారు. డీఈలు కె.ఉపేందర్, జంపాల రాజం, ఏడీఈ పంజాల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.