‘ఇందిరమ్మ’కు అర్హులనే ఎంపిక చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’కు అర్హులనే ఎంపిక చేయాలి

May 3 2025 11:24 AM | Updated on May 3 2025 11:24 AM

‘ఇందిరమ్మ’కు అర్హులనే ఎంపిక చేయాలి

‘ఇందిరమ్మ’కు అర్హులనే ఎంపిక చేయాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: అర్హులైన వారిని మాత్రమే ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థకార్యాలయంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టే గెజిటెడెట్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గెజిటెడ్‌ లెవెల్‌ పరిశీలన సోమవారం నాటికి పూర్తి కావాలన్నారు. ఇచ్చిన చెక్‌ లిస్టు ఆధారంగా పరిశీలించాలని, పూర్తిగా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై గాని, దరఖాస్తుదారు భార్య,భర్త పేర్లపై మాత్రమే భూ పత్రాలు ఉండాలన్నారు. అదనపు కమిషనర్‌ సువార్త, డిప్యూటీ కమిషనర్లు స్వరూపరాణి, ఖాదర్‌ మొహియుద్దీన్‌, సహాయ కమిషనర్‌ వేణు మాధవ్‌, డీఈలు లచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రావు, అయూబ్‌ఖాన్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

చెత్త రహిత డివిజన్లుగా మార్చాలి

స్వచ్ఛతను పాటించడం ద్వారా నగరంలోని అన్ని డివిజన్లను చెత్త రహితంగా మార్చాలని కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌ అన్నారు. శుక్రవారం కళాభారతిలో వార్డు అధికారులు, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, ఆర్‌ఐలతో సమీక్ష నిర్వహించారు. తమ డివిజన్ల పరిధిలో పారిశుద్ధ పనులపై వార్డు అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. అలాగే ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని, శనివారం నుంచి నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రతి దుకాణానికి ట్రేడ్‌ లైసెన్సు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశారు.

నగరపాలకసంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement