‘పురుమల్ల’పై వేటు వేయండి | - | Sakshi
Sakshi News home page

‘పురుమల్ల’పై వేటు వేయండి

May 3 2025 11:24 AM | Updated on May 3 2025 11:24 AM

‘పురుమల్ల’పై వేటు వేయండి

‘పురుమల్ల’పై వేటు వేయండి

● పీసీసీ అధ్యక్షుడికి జిల్లా నేతల ఫిర్యాదు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: తన తీరుతో పార్టీకి నష్టం చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌ను కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని జిల్లా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దాదాపు 200 మంది నాయకులు శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశకుమార్‌ గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన శ్రీనివాస్‌కు టికెట్‌ ఇస్తే, ప్రత్యర్థులతో కుమ్మకై ్క అస్త్రసన్యాసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్‌లో పార్టీకి నష్టం కలిగిస్తున్న పురుమల్లను వెంటనే సస్పెండ్‌ చేయాలన్నారు. కాగా గత నెల 28వ తేదీన సమావేశంలో జరిగిన గొడవకు సంబంధించి నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకొంటానని మహేష్‌కుమార్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, పీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి రహమత్‌ హుస్సేన్‌, పులి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement