
చట్టాలకు లోబడి నడుచుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): రాజ్యాంగంలోని చట్టాలకు లోబడి ప్రతీ ఒక్కరు నడుచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేశ్ సూచించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా జాతీ య న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు చింతకుంట వార్డు కార్యాలయంలో గురువారం చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం గురించి వివరించిన జడ్జి చట్ట ప్రకారం మహిళలు ఎన్ని గంటలు పనిచేయాలి, యాజమాన్యం ఎటువంటి సహాయ సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది అనే అంశాలను వివరించారు. ఎలాంటి న్యాయపరమైన సాయం అందించడానికై నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, న్యాలమడుగు శంకరయ్య పాల్గొన్నారు.
కార్మికులకు అండగా బీఆర్ఎస్: ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్: తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర మరువలేనిదని, బీఆర్ఎస్ కార్మికులకు అండగా ఉంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా బీఆర్టీయూ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమలాకర్ జెండా ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకై క పండుగ మేడే అన్నారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, బీఆర్టీయూ నాయకులు మద్దెల రాజేందర్, దావు రాజమల్లయ్య, గడ్డం సంపత్, లింగయ్య, సంపత్, రాములు, రమేశ్ పాల్గొన్నారు.
ఓపెన్ టెండర్ పూర్తి
కరీంనగర్: విద్యాశాఖ పరిధిలోని డీసీఈబీ కాంప్లెక్స్లో షాపుల కేటాయింపు కోసం ఓపెన్ టెండర్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పేర్కొన్నారు. విద్యాశాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కాంప్లెక్స్లో ఏడు దుకాణాలను ఐదేళ్లపాటు అద్దె కేటాయింపు కోసం గురువారం ఓపెన్ టెండర్ ప్రక్రియను కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ టెండర్లో 26మంది పాల్గొనగా, నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. షాపులు పొందిన వారు ఈనెల 8వ తేదీలోపు డిమాండ్ డ్రాఫ్ట్ (ఈఈ) చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్రావు, డీసీఈబీ కార్యదర్శి స్వదేశ్కుమార్, జిల్లా సైన్స్అధికారి జయపాల్రెడ్డి, ప్రణాళిక సమన్వయకర్త ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యుత్ భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని విద్యుత్ భవన్లో గురువారం విద్యుత్ భద్రత వారోత్సవాల పోస్టర్, కరపత్రాలను టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు ఆవిష్కరించారు. రైతులు, వినియోగదారులు విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా భద్రత జాగ్రత్తలను పాటించాలని కోరారు. ప్రతి విద్యుత్ ఉద్యోగి రైతులకు, వినియోగదారులకు విద్యుత్ భద్రత జాగ్రత్తల గురించి వివరించాలని సూచించారు. డీఈలు కే.ఉపేందర్, ఎం.తిరుపతి, కాళిదాసు, ఏడీఈ ఎం.లావణ్య, పీవో బండారి చంద్రయ్య పాల్గొన్నారు.

చట్టాలకు లోబడి నడుచుకోవాలి

చట్టాలకు లోబడి నడుచుకోవాలి

చట్టాలకు లోబడి నడుచుకోవాలి