
అమ్మమ్మ, తాతయ్యకు బాలుడి అప్పగింత
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాకేంద్రంలోని తులసీనగర్కు చెందిన రమ అనే మహిళ తన నాలుగేళ్ల కుమారుడిని విచక్షణారహితంగా దాడిచేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. సఖీ కేంద్రం నిర్వాహకులు బాలుడిని చేరదీశారు. రమకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆమెకు మతిస్థిమితం సరిగా ఉండటం లేదని, గతంలో కూడా మానసిక వైద్యులకు చూపించుకుందని విచారణలో వెల్లడైంది. దీంతో బాలుడిని రాయికల్కు చెందిన అమ్మమ్మ, తాతయ్యకు అప్పగించారు.
తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చిన సఖీ కేంద్రం నిర్వాహకులు