ఎంఆర్‌ఎఫ్‌ కేసు రాజకీయ ప్రేరేపితం | - | Sakshi
Sakshi News home page

ఎంఆర్‌ఎఫ్‌ కేసు రాజకీయ ప్రేరేపితం

Apr 20 2025 1:58 AM | Updated on Apr 20 2025 1:58 AM

ఎంఆర్

ఎంఆర్‌ఎఫ్‌ కేసు రాజకీయ ప్రేరేపితం

ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025
● ఆధారాలు లేకుండా వేసిన పనికిమాలిన వ్యాజ్యం ● విలువైన సమయాన్ని వృథా చేసినందుకు పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా ● మానేరు రివర్‌ఫ్రంట్‌పై దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేసిన ఎన్జీటీ ● కేసు ఎవరు వేయించారో కాల్‌రికార్డ్స్‌ వెల్లడిస్తానన్న కమలాకర్‌

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

మానేరు రివర్‌ఫ్రంట్‌తో మానేరు నదికి, డ్యామ్‌కు నష్టం వాటిల్లుతుందని, నదిలో జీవరాశులు, పర్యావరణంగా ఇబ్బంది కలుగుతుందని అభ్యంతరం తెలుపుతూ దాఖలైన వ్యాజ్యాన్ని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) కొట్టేసింది. ఈక్రమంలో పలుకీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యంలా అనిపిస్తోంది. ఎలాంటి సహేతుకమైన ఆధారాలు లేకుండా దాఖ లు చేసిన పిటిషన్‌ కాబట్టి ధర్మాసనం వ్యాజ్యాన్ని కొట్టివేసింది. పనికిమాలిన పిటిషన్‌తో ధర్మాసనం సమయం వృథా చేశారు’ అని వ్యాఖ్యానించింది.

పనికిమాలిన పిటిషన్‌ ఇది..

అకారణంగా ధర్మాసనం సమాయాన్ని వృథా చేసినందుకు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. తాము చేపట్టే వరద నియంత్రణ చర్యలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఇటీవల నీటిపారుదల శాఖ ట్రిబ్యునల్‌కు దాఖలు చేసిన అఫిడవిట్‌లో దాఖలు చేసింది. పర్యావరణశాఖ కూడా తాము చేపట్టే పనులకు ఎలాంటి ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్‌లు అక్కర్లేదని స్పష్టంచేసింది. వీరితోపాటు కాంట్రాక్టర్‌ రాసిన లేఖను కూడా ధర్మాసనానికి అందజేశారు. నీటిపారుదల, పర్యాటకం, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తదితర శాఖలు ధర్మాసనంలో దాఖలు చేసిన అఫిడవిట్లను, కేసు పూర్వపరాలను పరిశీలించిన ట్రిబ్యునల్‌ ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసుగా అభివర్ణించింది. ఆరోపణలకు అనుగుణంగా ఎలాంటి కారణాలు చూపించలేకపోయారని వ్యాఖ్యానించింది. విలువైన సమయాన్ని వృథా చేసినందుకు కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఎం. వెంకటరెడ్డికి రూ.లక్ష (ఎన్జీటీ సౌత్‌జోన్‌)కు చెల్లించాలని తీర్పునిచ్చింది. అందులో రూ.50 వేలు మొక్కలు నాటేందుకు, రూ.25 వేలు పర్యావరణ న్యాయసూత్రాల పుస్తకాల కొనుగోలుకు, మిగిలిన రూ.25 వేలు ఎన్జీటీకి వచ్చే లిటిగేంట్ల మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది.

త్వరలో కాల్‌ రికార్డ్‌ బయటపెడతా

ఈ విషయంలో నేను మొదటినుంచి ఆరోపిస్తున్నదే నిజమైంది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని ఎన్జీటీ పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. ఈ కేసు ఎవరు వేయించారో? కేసు వేసే ముందు, వేసిన తరువాత ఎవరు ఎవరితో మాట్లాడారో కాల్‌ రికార్డ్స్‌ బయటపెడతా. వారిని ప్రజల ముందు దోషిగా నిలబెడతా. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడి రూ.546 కోట్లు విడుదలైన అభివృద్ధి పనిని అడ్డుకునే యత్నం కోర్టు మొట్టికాయలు వేయడంతో బెడిసికొట్టినట్లయింది. ఎంఆర్‌ఎఫ్‌ ప్రాజెక్టు పూర్తయితే బీఆర్‌ఎస్‌ పార్టీకి, గంగుల కమలాకర్‌కు పేరు వస్తుందన్న కుట్రతో కేసు వేయించారు. ఇప్పటికై నా కళ్లు తెరిచి, అభివృద్ధికి సహకరించాలి. ఇక మానేరు రివర్‌ ఫ్రంట్‌ విషయంలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నాయకులపై కోర్టులో కేసు వేస్తాం.

– మాజీ మంత్రి గంగుల కమలాకర్‌

మానేరు రివర్‌ఫ్రంట్‌ నమూనా చిత్రం

ఎంఆర్‌ఎఫ్‌ కేసు రాజకీయ ప్రేరేపితం1
1/1

ఎంఆర్‌ఎఫ్‌ కేసు రాజకీయ ప్రేరేపితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement