
రివర్ఫ్రంట్ అవినీతిపై విచారణ జరిపించాలి
● మాజీ మేయర్ వై.సునీల్రావు
కరీంనగర్టౌన్: మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అక్రమాలకు కేరాఫ్గా మారిందని, ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించాలని బీజేపీ నేత, మాజీ మేయర్ యాదగిరి సునీల్రావు డిమాండ్ చేశారు. మానేరు రివర్ ఫ్రంట్తో పాటు తీగలవంతెనను శుక్రవారం బీజేపీ శ్రేణులతో కలిసి సందర్శించారు. అనంతరం సునీల్రావు మాట్లాడుతూ ఎల్ఎండీ గేట్ల నుంచి 5లక్షల క్యూసెక్కుల నీటి విడుదల కెపాసిటీ ఉండగా.. కేవలం 80వేల క్యూసెక్కుల నీటి విడుదలను తట్టుకునే విధంగా రివర్ఫ్రంట్ పనులు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.546 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టగా, ఇప్పటి వరకు రూ.226కోట్ల పనులు చేసి, బిల్లులు తీసుకుని, నాణ్యత లోపంతో నత్తనడకన పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవకతవకలకు పాల్పడుతున్న ఏజెన్సీ కాంట్రాక్టర్, బా ధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రూ.196 కోట్లతో తీగలవంతెన నిర్మాణం చేస్తే, ప్రస్తుతం అధ్వానంగా మారిందన్నారు.