
సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం
కామారెడ్డి టౌన్: గత ప్రభుత్వ పథకాలతో పాటు కాంగ్రెస్ హామీ ఇచ్చిన పథకాలను సైతం ఆపకుండా అమలు చేస్తున్నామని ఎకై ్సజ్ శాఖ మంత్రి, జి ల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ 70 నుంచి 80 శాతం సీట్లు సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. దీనికి సంబంధించిన భూసేకరణ నిధుల కోసం షబ్బీర్ అలీ ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిశారన్నారు.
ప్రొటోకాల్ పేరిట అభివృద్ధిని అడ్డుకోవద్దు..
ప్రొటోకాల్ పేరిట నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కామారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కామారెడ్డిని అభివృద్ధి చేయడం మాత్రం ఆపనన్నారు. గత ప్రభుత్వం పంటల నష్ట పరిహా రం కోసం ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం జిల్లాకు రూ. 74 లక్షలు విడుదల చేసిందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, పార్టీ జిల్లా పరిశీల కులు సత్యనారాయణగౌడ్, వేణుగోపాల్యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, నాయ కులు ఎడ్ల రాజిరెడ్డి, బద్దం ఇంద్రకరణ్రెడ్డి, పండ్ల రాజు, గోనె శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎన్ని ఇబ్బందులున్నా..
బాన్సువాడ : ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేస్తున్నామ ని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. గురువారం బాన్సువాడలో పోచారం శ్రీనివాస్రెడ్డి నివాసంలో బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రా లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఒక్క బాన్సువాడలోనే 11 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందన్నారు. పిల్లలు పక్కదారి పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. దయ్యాలను పెంచి పోషించిన బీఆర్ఎస్ అధినేత దేవుడెట్ల అవుతాడని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. దయ్యాలకు నాయకత్వం వహించినప్పుడు దయ్యాల నాయకుడే అవుతాడని పేర్కొన్నారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాల్రాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్యాకేజీని పూర్తి చేస్తాం
ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం