సదాశివనగర్ : పంటల సాగులో తక్కువ మోతాదులోనే యూరియా వాడాలని ఏరువాక శాస్త్రవేత్త అనిల్రెడ్డి సూచించారు. గురువారం అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్రెడ్డి మాట్లాడుతూ భాస్వరం ఎరువులను దుక్కిలో మాత్రమే వాడాలన్నారు. అవసరం మేరకు మాత్రమే రసాయన ఎరువులను వినియోగించాలని సూచించారు. అధికారులు సిఫారసు చేస్తేనే పురుగు మందులను స్ప్రే చేయాలన్నారు. పంట మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమం కోఆర్డినేటర్ రేవంత్, ఏడీఏ రత్న, ఏవో ప్రజాపతి, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీబీ వ్యాధిపై అవగాహన
కామారెడ్డి అర్బన్: ఎవరైనా రెండు వారాలకన్నా ఎక్కువగా దగ్గు, జ్వరం, చాతినొప్పిలతో బాధపడడం, తెమడలో రక్తం వస్తే క్షయ వ్యాధి (టీబీ)గా అనుమానించాలని జిల్లా కార్మిక సహాయ కమిషనర్ కోటేశ్వర్లు పేర్కొన్నారు. టీబీ వ్యాధి ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని బీడీ ప్యాకింగ్ కార్మికులు, మునీమ్లకు అవగాహన కల్పించారు. సమావేశంలో కోటేశ్వర్లు మాట్లాడుతూ టీబీ లక్షణాలున్నవారు ఆశ వర్కర్లను సంప్రదిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా టీబీ పరీక్షలు చేయడంతో పాటు వ్యాధి నిర్ధారణ తర్వాత ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. ఈ విషయాన్ని బీడీ కార్మికులకు బీడీ మునీమ్లు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆశ వర్కర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
కామారెడ్డి క్రైం : పండుగలను ప్రశాంత వా తావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి ఏ ఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. కామారెడ్డి డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉ న్న హిందు, ముస్లిం మత పెద్దలతో గురువా రం జిల్లా కేంద్రంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా శాంతిభద్రతలకు వి ఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరి రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి, ఎస్సైలు, వివిధ సంఘాల ప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు.
పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో షబ్బీర్కు చోటు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) రాజకీయ వ్యవహారాల కమిటీని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం గురువారం ప్రకటించింది. కామారెడ్డి జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఈ కమిటీలో చోటు కల్పించారు.
పారితోషికం చెల్లించాలి
కామారెడ్డి అర్బన్ : గతేడాది నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు వెంటనే పారితోషికం చెల్లించాలని ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్ కుమార్ గౌడ్, రాజేష్ డిమాండ్ చేశారు. ఈ విషయమై గురువారం జిల్లా ప్రణాళిక అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇతర జిల్లాల్లో పారితోషికం చెల్లించారని, కామారెడ్డి జిల్లాలోనూ చెల్లించి న్యాయం చేయాలని కోరారు.

ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి