
నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ
కామారెడ్డి రూరల్: రేషన్ బియ్యం పంపిణీ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఒక్కో యూనిట్కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున అందిస్తారు. అయితే ప్రతి నెలా 1 నుంచి 15వ తేది వరకు మాత్రమే బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు.
స్టేషన్లకు ప్రొబెషనరీ ఎస్సైలు
కామారెడ్డి క్రైం: జిల్లాలో ముగ్గురు ప్రొబెషనరీ ఎస్సైలకు శిక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్లను కేటాయిస్తు ఎస్పీ రాజేశ్చంద్ర బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్స్టేషన్ నిర్వహణ విధులు తెలుసుకునేందుకుగాను నెల రోజులపాటు ఆయా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించనున్నారని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. లింగంపేట పీఎస్కు పి రాఘవేంద్ర, నస్రుల్లాబాద్కు అరుణ్కుమార్, రామారెడ్డికి నవీన్చంద్రను కేటాయించారు.
పదిహేను రోజుల్లో
బస్టాండ్ను ప్రారంభిస్తాం
ఎల్లారెడ్డి: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ను 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్లో సీసీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి 15 రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. అలాగే ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి జూన్ చివరిలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. మధ్యంతరంగా నిలిచిన ఆర్టీసీ బస్టాండ్, వంద పడకల ఆస్పత్రి పనులకు మంత్రితో చర్చించి నిధులు మంజూరు చేయించామన్నారు. ఆయనవెంట మున్సిపల్ మాజీ చైర్మన్ పద్మశ్రీకాంత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వినోద్గౌడ్, కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్, పప్పు వెంకటేశం, రఫీక్, ఆరిఫ్, అజహర్ తదితరులున్నారు.
రేపు కాంగ్రెస్
విస్తృత స్థాయి సమావేశం
కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాలులో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, వ్యవసాయ సలహాదారు శ్రీనివాస్రెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశానికి జిల్లాలోని తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకావాలని కోరారు.