
కాటేపల్లిలో అగ్ని ప్రమాదం
పెద్దకొడప్గల్: పశువుల మేత కోసం ట్రాక్టర్లో తరలిస్తున్న గడ్డికి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన కాటేపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాటేపల్లి నుంచి ట్రాక్టర్లో తీసుకెళ్తున్న వరిగడ్డికి కుమ్మరి కుంట వద్ద విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు యత్నించినా అదుపులోకి రాకపోవడంతో గడ్డిని ట్రాక్టర్ నుంచి తొలగించారు.
బోర్గాం జెడ్పీహెచ్ఎస్లో..
మోపాల్: నగర శివారులోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి స్టోర్రూమ్లో అగ్నిప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రం, పాఠశాల హెచ్ఎం శంకర్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అర్పివేశారు. ప్రమాదంలో పాత పుస్తకాలు, పాత బెంచీలు, ఇతరాత్ర సామగ్రి కాలిపోయాయి. షాట్సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్లు హెచ్ఎం శంకర్ తెలిపారు.