
భూభారతి పోర్టల్తో రైతుల సమస్యలు పరిష్కారం
లింగంపేట(ఎల్లారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ ద్వారా రైతులు సమస్యలు పరిష్కారం కానున్నాయని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి వెల్లడించారు. బుధవారం లింగంపేట మండలంలోని జల్దిపల్లి, రాంపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా జల్దిపల్లిలో ఆమె మాట్లాడారు. ఇచ్చిన సమస్య ను క్షుణంగా విచారించి పరిష్కారం చేయన్నుట్లు ఆమె పేర్కొన్నారు. రెవెన్యూ, అటవీ శాఖ భూము ల వివాదాలను ఇరు శాఖల అధికారులు కలిసి సంయుక్తంగా సర్వే చేసి పరిష్కరించనున్నట్లు తెలిపారు. మండలంలోని జల్దిపల్లి గ్రామంలో 18, రాంపూర్ గ్రామంలో 179 మంది సమస్యలపై దరఖా స్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో రెవెన్యూ, అటవీ శాఖ వివాదంలో మరికొన్ని భూములు ఉన్నాయన్నారు. ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, ఆర్ఐ కిరణ్, ఎఫ్ఆర్వో ఓంకార్, అధికారులు, తదితరులున్నారు.
బాన్సువాడ సబ్కలెక్టర్ కిరణ్మయి