జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: మండలకేంద్రంలోని గిరిజన గురుకుల సంక్షేమ బాలుర పాఠశాలకు చెందిన క్రీడాకారుడు సున్నం చరణ్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్లోని పటాన్చెరువులో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్ 17 వాలీబాల్ టోర్నమెంట్లో ఉమ్మడి వరంగల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. జట్టు తరఫున ఆడిన చరణ్ అత్యంత ప్రతిభ కనబర్చడంతో సెలక్షన్ కమిటీ సభ్యులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ జైపాల్, పేట సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న చరణ్ను ప్రిన్సిపాల్తో పాటు వైస్ ప్రిన్సిపాల్ మాధవి, వెంకటయ్య, పీడీ మహేందర్, పీఈటీ మంతెన శ్రీనివాస్, కోచ్ వెంకటేష్, ఉపాధ్యాయులు అభినందించారు.
పోలీస్స్టేషన్లో ఓపెన్ హౌస్
భూపాలపల్లి అర్బన్: పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఓపెన్హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులకు పోలీసుల విధులు, సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, ఫింగర్ ప్రింట్స్ కమ్యూనికేషన్ల గురించి వివరించారు. విద్యార్థులకు చెడు వ్యసనాలకు గురికావొద్దని సీఐ నరేష్కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాధి నిరోధక టీకాలు
తప్పనిసరి
ములుగు రూరల్: చిన్నారులకు సకాలంలో తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలను ఇవ్వాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్ అన్నారు. మండల పరిధిలోని జంగాలపల్లి ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విపిన్కుమార్ మాట్లాడుతూ టీకాల ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. టీకాల వివరాలను యువిన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకా డ్యూలిస్టు ఇచ్చిన అనంతరం ఎంసీహెచ్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాల జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రణధీర్, పోషకాహార జిల్లా ప్రోగ్రామ్ అధికారి శ్రీకాంత్, డెమో సంపత్ తదితరులు పాల్గొన్నారు.
అభ్యసన సామర్థ్యాలను
పెంపొందించాలి
వాజేడు: విద్యార్థుల్లో విద్యా అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన పలు పాఠశాలలతో పాటు కేజీబీవీని తనిఖీ చేశారు. స్వయంగా విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. కేజీబీవీలో భోజనం చేసిన అనంతరం డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా డీఆర్ని రాయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేయాలని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ నమోదులో వాజేడు మండలం 100శాతంతో జిల్లాలో మొదటి స్థానంలో ఉందన్నారు. బడికి రాని పిల్లలను బడిలో చేర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉల్లాస్ జిల్లా సమన్వయకులు కృష్ణబాబు, ఎంఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక


