మహిళ హత్య కేసులో తల్లి, కొడుకు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసులో తల్లి, కొడుకు అరెస్టు

May 28 2025 12:01 PM | Updated on May 28 2025 12:01 PM

మహిళ హత్య కేసులో తల్లి, కొడుకు అరెస్టు

మహిళ హత్య కేసులో తల్లి, కొడుకు అరెస్టు

చందుర్తి(వేములవాడ): భూవివాదంలో మహిళను హత్య చేసిన రౌడీషీటర్‌, హత్యకు ప్రోత్సహించిన తల్లిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. చందుర్తి ఠాణాలో మంగళవారం నిందితులిద్దరిని సీఐ, ఎస్సైలు అరెస్ట్‌ చూపారు. చందుర్తికి చెందిన బొల్లు మల్లవ్వకు రౌడీషీటర్‌ బొల్లు మనోజ్‌ తల్లి మోహినవ్వకు కొద్దికాలంగా భూవివాదం ఉంది. ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకున్న రౌడీషీటర్‌ మల్లవ్వను అడ్డు తొలగించేందుకు సోమవారం పెద్దమ్మ గుడి సమీపంలో కాపుకాసి కత్తితో దాడిచేసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపాయాడు. ఈ హత్యకు ప్రోత్సహించిన బొల్లు మోహినవ్వ ఉరప్‌ మల్లవ్వ, రౌడీషీటర్‌ మనోజ్‌అను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. హత్యకు వినియోగించిన కత్తిని, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య, సిబ్బంది ఉన్నారు.

పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా

జిల్లాలోని పాతనేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. చందుర్తికి చెందిన బొల్లు మనోజ్‌పై 2023లో హత్యకేసుతోపాటు పలు దొంగతనాల కేసులు ఉన్నాయని, అయినా మార్పు రాకపోవడంతో 2024లో రౌడీషీటర్‌ తెరిచినట్లు తెలిపారు. రౌడీషీటర్లలో మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

హత్యకు వినియోగించిన కత్తి, సెల్‌ఫోన్‌ స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement