శరణార్థి  శిబిరంపై దాడి  | RSF drone strike kills at least 53 in Sudan displacement camp | Sakshi
Sakshi News home page

శరణార్థి  శిబిరంపై దాడి 

Oct 12 2025 4:55 AM | Updated on Oct 12 2025 4:55 AM

RSF drone strike kills at least 53 in Sudan displacement camp

సూడాన్‌లో 53 మంది మృతి 

కైరో: సూడాన్‌ అంతర్యుద్ధంలో అమాయకుల ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. తాజాగా సూడాన్‌లోని ఉత్తర డార్ఫూర్‌ రాష్ట్రంలోని ఎల్‌ఫాషర్‌ నగరంలో ఒక శరణార్థి శిబిరంపై ఆ దేశ పారామిలటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) జరిపిన దాడిలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మంది పిల్లలు, 15 మంది మహిళలు ఉన్నారు. 

ఐదుగురు పిల్లలు, ఏడుగురు మహిళలుసహా మరో 21 మంది ఈ దాడిలో తీవ్రంగా  గాయపడ్డారు.  ఈ ప్రాంతంపై పట్టుఉన్న సూడాన్‌ సైన్యంతో ఆర్‌ఎస్‌ఎఫ్‌ పోరాడుతోంది. దేశంలో మూడు సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం పట్ల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement