శరణార్థి  శిబిరంపై దాడి  | RSF drone strike kills at least 53 in Sudan displacement camp | Sakshi
Sakshi News home page

శరణార్థి  శిబిరంపై దాడి 

Oct 12 2025 4:55 AM | Updated on Oct 12 2025 4:55 AM

RSF drone strike kills at least 53 in Sudan displacement camp

సూడాన్‌లో 53 మంది మృతి 

కైరో: సూడాన్‌ అంతర్యుద్ధంలో అమాయకుల ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. తాజాగా సూడాన్‌లోని ఉత్తర డార్ఫూర్‌ రాష్ట్రంలోని ఎల్‌ఫాషర్‌ నగరంలో ఒక శరణార్థి శిబిరంపై ఆ దేశ పారామిలటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) జరిపిన దాడిలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మంది పిల్లలు, 15 మంది మహిళలు ఉన్నారు. 

ఐదుగురు పిల్లలు, ఏడుగురు మహిళలుసహా మరో 21 మంది ఈ దాడిలో తీవ్రంగా  గాయపడ్డారు.  ఈ ప్రాంతంపై పట్టుఉన్న సూడాన్‌ సైన్యంతో ఆర్‌ఎస్‌ఎఫ్‌ పోరాడుతోంది. దేశంలో మూడు సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం పట్ల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement