
మేడ్చల్: వాహనదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేడ్చల్ 44వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులను 2025 నాటికి పూర్తి చేస్తామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్రావు అన్నారు. శనివారం ఆయన అధికారులతో కలిసి విస్తరణ పనులను పరిశీలించి మాట్లాడారు. గుండ్లపోచంపల్లి నుంచి మేడ్చల్ శివారు వరకు ఫ్లైవర్ల కోసం పిల్లర్ల పనులు కొనసాగుతున్నాయన్నారు. గుండ్లపోచంపల్లి నుంచి సుచిత్ర వరకు పిల్లర్ల నిర్మాణంతో పాటు ఫైఓవర్ల నిర్మాణం పనులు సాగుతున్నాయని చెప్పారు.
మాదాపూర్: మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మార్చి 5 వరకు నిర్వహించనున్న ‘న్యూస్ ఆర్ట్ ఫెస్ట్– 2024’ను శనివారం పర్యాటకశాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, ప్రముఖ వ్యాపారవేత్త సుధారెడ్డిలు ప్రారంభించారు. 320 చిత్రాలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు వారు తెలిపారు.
చిత్రం.. సందేశాత్మకం