
ఖైరతాబాద్ : సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో రన్– 2025 పేరుతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి 3కే, 5కే, 10కే, హాఫ్ మారథాన్ ఆదివారం నిర్వహించారు. ఆరోగ్యకరమైన, చురుకైన తెలంగాణ సాధనే లక్ష్యంగా నిర్వహించిన మారథాన్లో పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి రన్నర్లు పాల్గొన్నారు. మారథాన్, రన్ను డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ ఏ రామ్కిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపీ జితేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి క్రీడా రంగాన్ని సాధనంగా మలుచుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఫిట్ తెలంగాణ సాధన కోసం యావత్ క్రీడా సమాజం కృషిచేయాలన్నారు. మానసిక, శారీరక వికాసానికి దోహదపడే క్రీడలు ఐక్యతను సాధించడమే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు. అవంతి కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస్రెడ్డి, సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు సోమ జగన్మోహన్రెడ్డి, సభ్యులు పన్నాల హరీష్ చంద్రరెడ్డి, శ్రీనివాస్ మగ్గారి, డాక్టర్ మహేష్ పాల్గొన్నారు. మారథాన్, రన్లో విజేతలను సన్మానించి, మెడల్స్ అందజేశారు.
ఇదీ చదవండి: అఖిల్ పెళ్లి సందడి : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్