ఉత్సాహంగా అంతర్‌ కళాశాలల వాలీబాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా అంతర్‌ కళాశాలల వాలీబాల్‌ పోటీలు

Nov 28 2025 8:37 AM | Updated on Nov 28 2025 8:37 AM

ఉత్సాహంగా అంతర్‌ కళాశాలల వాలీబాల్‌ పోటీలు

ఉత్సాహంగా అంతర్‌ కళాశాలల వాలీబాల్‌ పోటీలు

ఉత్సాహంగా అంతర్‌ కళాశాలల వాలీబాల్‌ పోటీలు ఫ్యాప్టో చైర్మన్‌ ప్రకటన బాధ్యతారహితం

దెందులూరు: పోటీతత్వం పట్టుదల నిరంతర సాధన ఈ రంగంలోనైనా విజయాన్ని తెచ్చిపెడుతుందని ఏలూరు జిల్లా స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ అజీజ్‌, దెందులూరు తహసీల్దార్‌ బీ.సుమతి అన్నారు. గురువారం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలలో రెండు రోజుల అంతర్‌ కళాశాలల వాలీబాల్‌ మహిళల పోటీలు ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌ నతానియేలు మాట్లాడుతూ రెండు రోజుల వాలీబాల్‌ మహిళల పోటీల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఐదు జిల్లాల్లో 14 కళాశాల నుంచి మహిళలు హాజరయ్యారన్నారు. ఈ పోటీల్లో యూనివర్సిటీ టీంను ఎంపిక చేశారన్నారు. ఈ పోటీల్లో సెయింట్‌ థెరిస్సా కాలేజీ ఏలూరు ప్రథమ స్థానం, ప్రభుత్వ కళాశాల రంపచోడవరం ద్వితీయ స్థానం, సీఆర్‌ రెడ్డి ఉమెన్స్‌ కాలేజ్‌ జట్టు తృతీయ స్థానం సాధించాయన్నారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పోలిరెడ్డి విజేతలకు షీల్డ్స్‌, సర్టిఫికెట్లు అందజేశారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులను ఉద్యమానికి సిద్ధం చేయాల్సిన రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్‌ ఉద్యమానికి కార్యాచరణ రూపొందించకుండా వచ్చే సంవత్సరం మార్చి నుంచి టీచర్లు ఉద్యమ బాట పడతారని పత్రికా ముఖంగా ప్రకటించడం బాధ్యతారహితమని ఏపీటీఎఫ్‌ ఏలూరు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కురమ ఆనంద కుమార్‌, అబ్బదాసరి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement