
యువత, విద్యార్థులకు వెన్నుపోటు
యువత పోరును జయప్రదం చేయాలి
కై కలూరు : నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలపై ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రాలు సమర్పించే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఆదివారం పిలుపునిచ్చారు. కై కలూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆటపాక డీఎన్నార్ ఐస్ ఫ్యాక్టరీకి సోమవారం ఉదయం 7 గంటలకు చేరుకోవాలన్నారు. అక్కడ నుంచి ఏలూరు బయలుదేరుతామన్నారు. యువత పోరుకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిశీలకులు వంకా రవీంద్రనాథ్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్ కుమార్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరవుతున్నారన్నారు.
ఉద్యోగాలు ఎప్పుడిస్తారు
ఏలూరు (ఆర్ఆర్పేట) : మోసం, వెన్నుపోటు ప్రధాన ఎజెండాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది. ఎన్నికలకు ముందు సూపర్సిక్స్తో పాటు అనేక హామీలను గుప్పించి ప్రజలను నమ్మించి వారి మద్దతుతో అధికారంలోకి వచ్చాక.. ఏడాదిగా అదిగో ఇదిగో అని కాలం వెళ్ళదీసింది. యువత, విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. సూపర్ సిక్స్ పథకాల్లోని ఇంటింటికీ ఉద్యోగం, లేకపోతే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దాని గురించి ప్రభుత్వం ఇప్పుడు కనీసం నోరు కూడా మెదపడంలేదు.
ఒక్క ఉద్యోగమూ లేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్సిక్స్ పథకాల్లోని ఇంటింటికీ ఉద్యోగం, లేని పక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. వలంటీర్లను తొలగించబోమని, ప్రతి వాలంటీర్కూ నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయకుండా వలంటీర్లను మోసం చేస్తూ వారి ఉద్యోగాలను పీకేసి రాక్షసానందం పొందింది. క్లాప్ ఆటోలు, ఎండీయూ వాహనాలను నిలిపి వేసి వాటిపై ఉపాధి పొందుతున్న నిరుద్యోగుల పొట్ట కొట్టింది.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో
గత ప్రభుత్వం యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే సచివాలయాల్లో సుమారు 700 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించగా మరో 10,500 మందికి వలంటీర్లుగా అవకాశం కల్పించింది. దీంతో పాటు పాతికేళ్ళుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న డీఎస్సీ అర్హులకూ టీచర్లుగా ఉద్యోగాలిచ్చింది. ఒక్కో స్కిల్ హబ్కు రూ. 11 లక్షల నిధులు మంజూరు చేసి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో స్కిల్హబ్లు ఏర్పాటు చేసింది. ఆయా కోర్సుల్లో శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు, పారితోషికం, శిక్షణ పొందే ప్రతి అభ్యర్థికి రూ.1000 స్టైఫండ్ ఇచ్చింది. స్కిల్ హబ్లలో శిక్షణ పొందిన సుమారు 3 వేల మందికి వివిధ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా కృషి చేసింది.
కూటమి ప్రభుత్వం రూ.540 కోట్ల బాకీ
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇంటింటికీ ఉద్యోగం ఇవ్వాలి. అది ఎలాగూ నెరవేర్చలేదు కాబట్టి నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సుమారు 1.50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఇస్తానన్న నిరుద్యోగ భృతిని 12 నెలలకు లెక్క వేస్తే ఇప్పటి వరకూ ఒక్కొక్కరికీ రూ.36 వేలు చొప్పున రూ.540 కోట్లు బకాయిపడింది.
ఫీజు రీయింబర్స్మెంట్ రాక అవమానాల పాలు
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యార్థుల చదువు రాచమార్గంలో పయనించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం ఒక్క రూపాయి కూడా జమ చేయక పోవడంతో విద్యార్థులు అవమానాలపాలతున్నారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని తరగతి గదుల్లో అందరి ముందూ నుంచోబెట్టి ఫీజుల గురించి నిలదీస్తుంటే విద్యార్థులు అవమానభారంతో తలెత్తుకోలేకపోతున్నారు.
నేడు వైఎస్సార్సీపీ యువత పోరు
కూటమి పాలనలో మోసపోయిన యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు పార్టీ నాయకులు సోమవారంయువత పోరు పేరిట ఆందోళనకు దిగుతున్నారు.
నిరుద్యోగ
భృతి
మాటేంటి
ఏడాది దాటినా ఒక్క ఉద్యోగమూ ఇవ్వని వైనం
నిరుద్యోగ భృతిపై నోరు మెదపని ప్రభుత్వం
నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం రూ.540 కోట్ల బాకీ
రీయింబర్స్మెంట్ బకాయి రూ.168.75 కోట్లు
యువత, విద్యార్థులకు అండగా నేడు వైఎస్సార్సీపీ యువత పోరు
రీయింబర్స్మెంట్ బకాయి రూ.168.75 కోట్లు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెనగా ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం 2019–20 సంవత్సరంలో 36,527 మంది విద్యార్థులకు రూ.95.78 కోట్లు, 2020–21 సంవత్సరంలో 37,148 మందికి రూ 77.97 కోట్లు, 2021–22లో 38,677 మంది విద్యార్థులకు రూ.105.67 కోట్లు, 2022–23లో 33,655 మందికి రూ.81.53 కోట్లు, 2023–24 సంవత్సరంలో 29,111 మంది విద్యార్థులకు రూ.22.45 కోట్లు జమ చేసింది. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం ఏడాదిలో ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థుల ఫీజుల బకాయిలు కొండల్లా పేరుకుపోయాయి. ఈ మేరకు జిల్లాలో సుమారు 37,500 మంది విద్యార్థులకు సగటున రూ.45 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం కూటమి ప్రభుత్వం మొత్తం రూ.168.75 కోట్లు బకాయి పడింది.
ప్రభుత్వాన్ని నిలదీయడానికే యువత పోరు
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్నీ వైఫల్యాలే. సంక్షేమ పథకాల అమలులో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. ఉద్యోగాలు ఇస్తానని ఇంతవరకూ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు ఊసే ఎత్తడం లేదు. దీనిపై నిలదీయడానికే యువతకు అండగా యువత పోరుబాట ఆందోళన చేపడుతున్నాం.
– కామిరెడ్డి నాని, ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన అధ్యక్షుడు
ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలి
రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులను ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. నిరుద్యోగ భృతి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే వారిని అస్సలు పట్టించుకోవడంలేదు. ఫీజులు చెల్లించడం కోసం తల్లిదండ్రులు అప్పుల కోసం తొక్కని గడప లేదు. వారు గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. బకాయిలను, నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలి.
– కోడె కాశి, వైఎస్సార్సీపీ ఉంగుటూరు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు

యువత, విద్యార్థులకు వెన్నుపోటు

యువత, విద్యార్థులకు వెన్నుపోటు

యువత, విద్యార్థులకు వెన్నుపోటు