పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

Jun 23 2025 6:06 AM | Updated on Jun 23 2025 6:06 AM

పీఆర్

పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంతవరకు నాలుగు డీఏలు పెండింగ్‌ ఉన్నప్పటికీ ఒక్క డీఏ కూడా విడుదల చేయలేదని, మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వెంటనే ఐఆర్‌ ప్రకటించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఇఫ్టూ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఏలూరు జిల్లా శాఖ సబ్‌ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ 2023 జూలై నుంచి అమలు కావలసిన పన్నెండో పీఆర్‌సీకి వెంటనే కమిషన్‌ నియమించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి బీ.రెడ్డి దొర మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థుల నమోదు ప్రక్రియ అన్ని పాఠశాలల్లో జరుగుతున్నందున అన్ని రకాల ట్రైనింగ్‌ను కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని బదిలీల్లో రిలీవర్‌ లేక నిలిచిపోయిన ఉపాధ్యాయులను తగు ఏర్పాటు చేసి వెంటనే రిలీవ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి యూవీ నరసింహరాజు, ఉపాధ్యక్షుడు ఎస్‌.దొరబాబు, రాష్ట్ర కౌన్సిలర్‌ కుటుంబరావు, సబ్‌ కమిటీ సభ్యులు కే.కొండయ్య, పీ.జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

బెల్ట్‌ షాపులపై ఉక్కుపాదం

నూజివీడు: బెల్ట్‌ షాపులకు అనుమతి లేదని, బెల్టు షాపుల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతామని ఏలూరు జిల్లా ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఏ ఆవులయ్య హెచ్చరించారు. పట్టణంలోని ఎకై ్సజ్‌ స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో బెల్ట్‌ షాపులకు సంబంధించి 425 కేసులు నమోదు చేశామని, వీటిల్లో 227 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బెల్ట్‌ షాపులకు సంబంధించి 1207 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

డీఎస్సీ పరీక్షకు 979 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు మెత్తం 979 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రంలో ఉదయం పరీక్షలకు 180 మందికి 173 మంది హాజరు కాగా మధ్యాహ్నం 180 మందికి 168 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 140 మందికి గాను 135 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 140 మందికి 120 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 207 మందికి 193 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్‌లో 200 మందికి గాను 190 మంది హాజరయ్యారు.

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష

భీమవరం: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 పరీక్షా కేంద్రాల్లో ఉదయం షిఫ్ట్‌కు 310 మందికి 296 మంది, మధ్యాహ్నం షిప్ట్‌లో 310 మందికి 238 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. స్పెషల్‌ స్క్వాడ్‌ టీం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదన్నారు.

‘దారితప్పుతున్న కూటమి’ బుక్‌లెట్‌ విడుదల

భీమవరం : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో 143 హామీలిచ్చి కేవలం 20 హామీలలోపే అమలు చేశారని జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలనన్‌ విమవర్శించారు. దారితప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన బుక్‌లెట్‌ని ఆదివారం భీమవరంలో విడుదల చేశారు. ఈ ఏడాది కాలం కూటమి ప్రభుత్వం పనిని సమీక్షించి సీపీఎం పార్టీ ఈ బుక్‌లెట్‌ని ముద్రించి విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి తన ఇచ్చిన హామీలలో 20లోపే అమలు చేశారన్నారు. అత్యధిక హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి రేటింగ్‌, గ్రేడింగ్‌ ఇవ్వాల్సి వస్తే ఈ సంవత్సర కాలంలో చాలా తక్కువ మార్కులే వచ్చాయన్నారు. 10కిగాను 1.75 మార్కులు వచ్చాయన్నారు. ఇప్పటికై నా ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని కోరారు.

పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి 
1
1/1

పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement