మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

May 4 2025 6:53 AM | Updated on May 4 2025 7:13 AM

ఏలూరు (టూటౌన్‌): దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20 నుంచి స మ్మెలోకి వెళుతున్నట్టు ది జోనల్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.అప్పరాజు తెలిపారు. శనివారం సమ్మె నోటీసును ఏలూరు అడిషనల్‌ కమిషనర్‌ చంద్రయ్యకు అందజేశారు. ఏలూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, ఎన్‌ ఎంఆర్‌ కార్మికుల సర్వీసులను రెగ్యులరైజ్‌ చే యాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని, సరెండర్‌ లీవ్‌ బకాయిలు, డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని సిబ్బందికి కనీస వేతనం రూ.35 వేలు, సమాన పనికి సమాన వేతనం కోసం సమ్మెలో పాల్గొంటున్నట్టు చెప్పారు. సంఘ సహాయ కార్యదర్శి డి.వెంకటేశ్వరరావు, కోశాధికారి బి.నారాయణరావు పాల్గొన్నారు.

నాణ్యతతో పనులు చేపట్టాలి

ఏలూరు(మెట్రో): జి ల్లాలో రూ.5.73 కోట్ల తో చేపట్టిన సోషల్‌ వె ల్ఫేల్‌ హాస్టళ్ల అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో హాస్టళ్ల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా హాస్టళ్లలో వసతులు కల్పించాలన్నారు. వేసవి సెలవులు అనంతరం హాస్టళ్లు పునః ప్రారంభిచేలోపు పనులు పూర్తిచేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన 8 హాస్టళ్ల భవనాలు తొలగించడం, నూతన భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ ఇన్‌చార్జి జేడీ ఎం.ముక్కంటి, అధికారులు పాల్గొన్నారు.

ధరల నియంత్రణకు చర్యలు

ఏలూరు(మెట్రో): జిల్లాలో ధరల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జాయింట్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పౌర సరపరాల శాఖ అధికారి వై.ప్రతాప్‌రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి ఎస్‌.రామ్మోహన్‌, వ్యవసాయ శాఖ అధికారి హబీబ్‌ బాషా, వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్‌ అధికారి వి.మహేంద్రనాద్‌ పాల్గొన్నారు.

లింగ నిర్ధారణను ఉపేక్షించం

ఏలూరు టౌన్‌: జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని, ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘాతో పాటు అవగాహన సద స్సులు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ ఆర్‌.మాలిని అన్నారు. ఏలూరులోని డీఎంహెచ్‌ఓ కార్యా లయంలో శనివారం పీసీ, పీఎన్‌డీటీ యాక్టు– 1994 సలహా కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో డెకాయ్‌ ఆపరేషన్లు పటిష్టంగా అమలు పరిచి, సీ్త్ర నిష్పత్తిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా లోని 115 స్కానింగ్‌ కేంద్రాల్లో తరచూ తనిఖీ లు నిర్వహించాలన్నారు. డెమో ఇన్‌చార్జి కె.ప్రదీప్తి, వైద్యాధికారులు పాల్గొన్నారు.

అమరావతి సభకు వెళ్లొస్తుండగా ప్రమాదం

నరసాపురం రూరల్‌: మండలంలోని సీతారామపురంలో 216 జాతీయ రహదారిపై శనివా రం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అమరావతిలో ప్రధాని సభకు వెళ్లి వస్తున్న రాజోలు డిపో బస్సు బ్రేక్‌ డౌన్‌ కావడంతో సంఘటనా స్థలంలో నిలిపివేశారు. అదే సభకు వెళ్లి తిరిగి వస్తున్న రాజోలు డిపో మరో బస్సు ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌, సిబ్బందికి గాయాలు కాగా 108లో నరసాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.

అడిషనల్‌ కమిషనర్‌కు సమ్మె నోటీసు అందిస్తున్న దృశ్యం

మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు 
1
1/3

మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు 
2
2/3

మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు 
3
3/3

మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement